- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
కమెడియన్ వేణు మాధవ్ ఓ సందర్భంలో చిరంజీవి కోసం తాను చేసిన త్యాగాన్ని వివరించారు. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని కూడా బయట పెట్టారు. అసలు వేణు మాధవ్ ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ నటుల వరకు అందరూ కోరుకుంటారు. టాలీవుడ్ లో చిరంజీవితో కొందరు నటులకు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి వారిలో వేణుమాధవ్ ఒకరు. వేణు మాధవ్ కి మెగా ఫ్యామిలీ హీరోలందరితో మంచి రిలేషన్ ఉంది. తమ్ముడు, అన్నవరం, శంకర్ దాదా ఎంబీబీఎస్, నాయక్, జై చిరంజీవ లాంటి సినిమాల్లో వేణు మాధవ్ నటించారు.
చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పై వేణు మాధవ్ కామెంట్స్
వేణు మాధవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కోసం తాను చేసిన త్యాగాన్ని బయటపెట్టారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా హిట్ కావాలని తిరుపతి వెళ్లి గుండు గీయించుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా వేణు మాధవ్ సమాధానం ఇచ్చారు.
అందుకే గుండు గీయించుకున్నా
అవును నిజమే. చిరంజీవి గారి 150 వ చిత్రం, బాలకృష్ణ గారి 100వ చిత్రం రెండూ సూపర్ హిట్స్ కావాలని గుండు గీయించుకున్నా. ఎందుకంటే వాళ్లిద్దరూ అంటే నాకు ఎంతో ఇష్టం. చిరంజీవి గారితో కలసి నటించాను. ఆ అనుబంధం ఉంది. డైరెక్టర్ వివి వినాయక్ నాకు లైఫ్ ఇచ్చారు. దిల్ సినిమా నా రేంజ్ పెంచింది. ఇక బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే బాలయ్య బాబు అంటే కూడా నాకు ఇష్టమే. డైరెక్టర్ క్రిష్ తో కూడా మంచి అనుబంధం ఉంది. వాళ్ళ కోసమే గుండు గీయించుకున్నా.
చిరంజీవికి బిస్కెట్ వేయాలని కాదు
అంతే కానీ మసిపూసి మారేడు కాయ చేయడం.. చిరంజీవి, బాలకృష్ణ లకు బిస్కెట్లు వేయడం లాంటివి నాకు అవసరం లేదు. మీరు గమనిస్తే ఆ రెండు సినిమాల్లో నేను లేను. అవకాశం వస్తే బావుంటుంది అని అనుకున్నా అంతే. రాంచరణ్ నుంచి అల్లు అర్జున్ వరకు చిరంజీవి గారి 150 వ సినిమాలో చిన్న రోల్ అయినా చేయాలి అని కాచుకుని కూర్చున్నారు. అలాంటప్పుడు నా లాంటి వాడికి అవకాశం రాకపోతే బాధపడకూడదు.
వేణు మాధవ్ సినిమాలు
నేను ఎంతో నిజాయతీగా వాళ్లపై అభిమానంతోనే ఆ త్యాగం చేశాను అని వేణుమాధవ్ తెలిపారు. దిల్, లక్ష్మీ, సింహాద్రి, సై లాంటి చిత్రాల్లో వేణు మాధవ్ కామెడీ హైలైట్ అయింది.

