- Home
- Entertainment
- అమితాబ్ బచ్చన్ రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ కపూర్.. 38 ఏళ్ళు పూర్తి
అమితాబ్ బచ్చన్ రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ కపూర్.. 38 ఏళ్ళు పూర్తి
అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన `మిస్టర్ ఇండియా` సినిమా విడుదలై 38 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
1987లో సంచలనం సృష్టించిన `మిస్టర్ ఇండియా`
దర్శకుడు శేఖర్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ ల `మిస్టర్ ఇండియా` సినిమా 1987 లో విడుదలైంది. బలమైన కంటెంట్తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.
రిజెక్ట్ చేసిన రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్
సలీం-జావేద్.. రాజేష్ ఖన్నాను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశారని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మూవీ కోసం రాజేష్ ఖన్నానే ఫస్ట్ ఛాయిస్. కానీ ఆయన ఈ మూవీ చేసేందుకు నో చెప్పారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కి కథ చెప్పగా, ఆయన కూడా తిరస్కరించారు.
అమితాబ్ నో చెప్పడంతో అనిల్ కపూర్ వద్దకు
అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చేయనని చెప్పిన తర్వాత, సలీం-జావేద్ ఈ కథతో బోనీ కపూర్ ని కలిశారు. ఆయనకు కథ నచ్చి, తన తమ్ముడు అనిల్ కపూర్ పేరును సూచించారు. అనిల్ కి కథ నచ్చి, సినిమాకి ఒప్పుకున్నారు.
అనిల్ కపూర్కి జోడీగా శ్రీదేవి
`మిస్టర్ ఇండియా` సినిమాతో అనిల్ కపూర్ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఆయనకు జోడీగా శ్రీదేవి నటించడం విశేషం. అమరీష్ పురి కూడా నెగటివ్ రోల్ చేశారు. అనిల్ కపూర్, శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసింది.
సినిమా మొత్తం ఒకే డ్రెస్తో అనిల్ కపూర్
`మిస్టర్ ఇండియా` సినిమా మొత్తంలో అనిల్ కపూర్ ఒకే జాకెట్, షర్ట్, ట్రౌజర్, టోపీ, బూట్లు వేసుకున్నారట. దర్శకుడు శేఖర్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. హీరో దుస్తులను చోర్ బజార్ నుండి కొన్నారని చెప్పారు.
2 కోట్లతో తీస్తే పది కోట్ల కలెక్షన్లు
`మిస్టర్ ఇండియా` సినిమాను శేఖర్ కపూర్ 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా అమితాబ్ తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు.
`మిస్టర్ ఇండియా`కి రెండు రీమేక్లు
`మిస్టర్ ఇండియా` సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో, దక్షిణాదిలో రెండు రీమేక్స్ వచ్చాయి. అవి కూడా హిట్ అయ్యాయి. తమిళంలో 'ఎన్ రథతిన్ రథమే' (1989), కన్నడలో 'జై కర్ణాటక' (1989) పేరుతో రీమేక్ చేశారు. 2011 లో `మిస్టర్ ఇండియా 2` పేరుతో 3డి సీక్వెల్ ప్రకటించారు. కానీ అది ప్రకటనకే పరిమితమయ్యింది.