నేను చిరంజీవి గారి ముఖం చూడలేను.. సుమ అడ్డాలో బయటపెట్టిన అలీ..
యాంకర్ సుమ బుల్లితెర కార్యక్రమాలకి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రాండ్ యాంకర్ గా మారిపోయింది. తన సీనియారిటీని అంతా జోడించి సుమ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
యాంకర్ సుమ బుల్లితెర కార్యక్రమాలకి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రాండ్ యాంకర్ గా మారిపోయింది. తన సీనియారిటీని అంతా జోడించి సుమ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా సుమ హోస్ట్ గా మరో షో ప్రారంభం అయింది. సుమ అడ్డా పేరుతో సరికొత్త షోని ప్రారంభించబోతున్నారు.
ఈ షో తొలి ఎపిసోడ్ జనవరి 7న ప్రసారం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి శేఖర్ మాస్టర్ , జానీ మాస్టర్.. అలీ, పోసాని అతిథులుగా హాజరయ్యారు. సుమ ఎప్పటిలాగే వినోదాత్మకంగా ఈ షోని నడిపిస్తోంది.
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ని ఎదురెదురుగా కూర్చోబెట్టి సుమ చేసే కామెడీ హంగామా, ప్రశ్నలు మామూలుగా లేవు. వీళ్లిద్దరి అల్లరిని సుమ తనదైన శైలిలో వివరించింది.
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తర్వాత ఈ షోలో అలీ, పోసాని హాజరయ్యారు. చిరంజీవి, అలీ గురించి సుమ ఒక షాకింగ్ మ్యాటర్ తెలుసుకుని ప్రశ్నించింది. మీరు ఎప్పుడు కలిసినా ఒకరిని నవ్వేస్తారట ఎందుకు అని సుమ ప్రశ్నించింది.
దీనికి అలీ బదులిస్తూ.. నేను ఎక్కువ సేపు చిరంజీవి గారి ముఖం చూడలేను.ఆయన విచిత్రంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అని అలీ తెలిపాడు. దీనితో ఈ షోలో నవ్వులు విరిశాయి. అలాగే సుమ.. పోసాని దంపతులపై ఫన్నీ సెటైర్లు వేసింది.
మొత్తంగా తన అడ్డా ఇది అంటూ ఎంటర్టైనింగ్ షోతో రెడీ అవుతోంది. సుమ ప్రస్తుతం క్యాష్ లాంటి షోలకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సుమ షోలకు సినీతారలు హాజరవుతూ సందడి చేస్తున్నారు.