- Home
- Entertainment
- చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..? మెగాస్టార్ రూమ్ లో ఉండే ఫోటో ఎవరిది..?
చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..? మెగాస్టార్ రూమ్ లో ఉండే ఫోటో ఎవరిది..?
మెగాస్టార్ చిరంజీవి ఉదయం లేవగానే ఓ హీరోయిన్ ఫోటో చూస్తారట. ఇంతకీ ఎవారా హీరోయిన్..? ఆమె మెగాస్టార్ కు ఎందుకు అంత ప్రత్యేకత.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇండస్ట్రీకి ఎంతో కష్టపడి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు రావడంతో పాటు.. మెగాస్టార్ గాఎదగడం ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. ఆయన వచ్చి మెగాస్టార్ గా ఎదగడంతో పాటు మెగా సాంమ్రాజ్యాన్ని విస్తరించి.. సౌత్ ఇండియాన్ కపూర్ ఫ్యామిలీ అనిపించుకున్నారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవానే ఎక్కువ అనడంలో అనుమానం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియా స్టార్లు.. నలుగురు టాలీవుడ్ స్టార్లు.. నిర్మాణ సంస్థలు, అనేక రకాల బిజినెస్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రత్యేక సినిమా ప్రపంచాన్ని సృష్టించారు చిరు.
Also Read: తమన్నా .. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందా..?
గెలుపోటములు లెక్క చేయకుండా సాగిపోతున్న చిరంజీవి.. ఈమధ్య కాలంలో ఎక్కువగా సక్సెస్ ను అందుకోలేదు. దాదాపు నాలుగైదు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో.. కాస్త జాగ్రత్తగా అడుగులువేస్తున్నారు చిరు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈమూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. తన సీనియర్స్ ను గౌరవిస్తూనే ఉంటారు.
Also Read: శ్రేయా ఘోషల్ వాయిస్ అంత స్వీట్ గా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా..?
Savitri Gemini Ganesan
కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ఎవరు అభిమాన నటులు. ఆయన రోజు ఉదయం లేవగానే ఓ నటి ఫోటోను చూస్తారట. ఇంతకీ ఎవరు ఆ నటి తెలుసా..? ఆమె ఎవరో కాదు మహానటి సావిత్రి. అవును ఉదయం లేవగానే చిరంజీవి మహానటి సావిత్రమ్మ ఫోటోను చూస్తారట.
అంతే కాదు చిరంజీవి బెడ్ ఎదురుగా సావిత్రి ఫోటో ఒకటి ఉంటుందట. ఆమె అంటే అంత అభిమానమట మెగాస్టార్ కు. ఈ విషయాన్ని సావిత్రి కూతురు విజయఛాముండేశ్వరి వెల్లడించారు. ఆమధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇలా అన్నారు. అసలు విషయం ఏంటంటే..?
Also Read: విజయ్ నుంచి రజినీ వరకు టాప్ 10 స్టార్స్ పెళ్లిళ్లు ఎప్పుడు జరిగాయి..?
Actress Savitri
రీసెంట్ గా హైదరాబాద్ లో మహానటి సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని బుక్ ని లాంచ్ చేసారు. అయితే ఈ కార్యక్రమానికి పిలవడానికి చిరంజీవి ఇంటికి వెళ్ళారట. విజయ. అప్పుడు కాలుకు దెబ్బ తగలడంతో.. తాను వచ్చానని తెలిసి పై నుంచి కిందకు కష్టపడి దిగారట. అంతే కాదు తనను ఎంతో మర్యాదగా చూసుకున్నారని. ఈ సందర్భాగా చిరంజీవి మాట్లడుతూ.. రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాను. నా బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది అని చెప్పారట. అంతే కాదు అలా చెపితే నమ్ముతారో లేదో అని ఫోటో కూడా తెచ్చి చూపించారట.
Chiranjeevi
ఈ విషయంతో మెగాస్టార్ చిరంజీవికి సావిత్రి అంటే ఎంత గౌరవం.. ఆమె ను ఎంతగా ఆరాధిస్తారో అందరికి తెలిసింది. అంతే కాదు.. మహనటి గురించి తెలియని ఈ తరం వారికి కూడా ఈ న్యూస్ తో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చేస్తున్నారు. ఈసినిమా తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఈ ఏడాది మిడ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.