- Home
- Entertainment
- ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకున్న నటీమణులు..చిరంజీవి హీరోయిన్లు ఇద్దరు, 11 ఏళ్ళైనా ఆమె సింగిల్ గానే
ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకున్న నటీమణులు..చిరంజీవి హీరోయిన్లు ఇద్దరు, 11 ఏళ్ళైనా ఆమె సింగిల్ గానే
చిత్ర పరిశ్రమలో లవ్ బ్రేకప్ లు సహజమే. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోతే అభిమానుల్లో, సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎగేజ్మెంట్ ని రద్దు చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

Chiranjeevi
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లో సాధారణంగా జరుగుతుంటాయి. నటీనటుల లవ్ ఎఫైర్స్ గురించి అనేక రూమర్స్ వస్తుంటాయి. కొందరు నటీమణులు, నటులు తమ రేలషన్ ని సీక్రెట్ గా మైంటైన్ చేస్తుంటారు. అయితే పెళ్లి విషయం దాచిపెట్టడం కుదరదు. కొందరు హీరోయిన్లు ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా ఆ తర్వాత బ్రేకప్ చేసుకున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
మెహ్రీన్
టాలీవుడ్ లో మెహ్రీన్ మొన్నటివరకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగింది. ఇటీవల ఆమెకి ఆఫర్స్ కొంత వరకు తగ్గాయి. మెహ్రీన్ 2021లో భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. అతడు బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి. వారి తండ్రి, తాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. కానీ మెహ్రీర్ నిశ్చితార్థం తర్వాత విభేదాల కారణంగా అతడితో విడిపోయింది. ఇప్పటికీ ఆమె సింగిల్ గానే ఉంది.
త్రిష
సౌత్ స్టార్ హీరోయిన్ గా త్రిష ఇప్పటికీ వెలుగు వెలుగుతోంది. చిరంజీవి లాంటి అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. త్రిష దాదాపు 11 ఏళ్ళ క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకుంది. 2015లో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం జరిగింది. విభేదాల కారణంగా పెళ్ళికి ముందే అతడితో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది. 11 ఏళ్ళు అయినా త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది.
రష్మిక
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న 2017లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇటీవల రష్మిక విజయ్ దేవరకొండ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కరీష్మా కపూర్
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్ ల నిశ్చితార్థం గతంలో జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వీరి నిశ్చితార్థం రద్దయింది. ఆ తర్వాత అభిషేక్.. ఐశ్వర్యారాయ్ ని వివాహం చేసుకున్నారు.
గౌహర్ ఖాన్
బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్, నిర్మాత షాజిద్ ఖాన్ ల నిశ్చితార్థం గతంలో జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ విడిపోయారు. గౌహర్ ఖాన్ ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ పెర్ఫామ్ చేసింది. నా పేరే కాంచన మాల అంటూ అలరించింది.

