Intinti Gruhalakshmi: నందు వాళ్లని ఘోరంగా అవమానించిన బసవయ్య దంపతులు.. కొడుకు ప్రవర్తన చూసి షాకైన రాజ్యలక్ష్మి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. డబ్బు కోసం సవతి కూతురు జీవితాన్ని తాకట్టు పెట్టిన చేసిన ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఈరోజు ఏప్రిల్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో పూజ ప్రారంభించడానికి టైం అయింది ఇంకా ఎవరైనా రావాలా అని అడుగుతారు పంతులుగారు. మా పుట్టింటి వాళ్ళు రావాలి అంటుంది దివ్య. ఇలాంటప్పుడు కూడా సమయానికి రావాలని తెలియదా? మీ పుట్టింటి వాళ్ళకి అని దెప్పుతుంది బసవయ్య భార్య. పర్వాలేదమ్మా సమయానికి దీపం వెలిగిస్తే పూజ కాస్త అటు ఇటుగా అయినా ప్రారంభించవచ్చు అంటారు పంతులుగారు. అయితే దీపం వెలిగిస్తాను అని దీపం వెలిగించబోతే అది ఒక పట్టానా వెలగదు. దీపం వెలిగించడం కూడా చేతకాదు అని పంతులుగారి ముందే దెప్పి పొడుస్తుంది బసవయ్య భార్య.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gyrm3htyv7q9sh9q2bxsqkf5/4-png_300x190xt.jpg)
ఏమి పర్వాలేదు నిదానంగా వెలిగించు అంటారు పంతులుగారు. అప్పుడు దీపాన్ని వెలిగిస్తుంది దివ్య. అప్పుడే తులసి వాళ్ళు వస్తారు. తల్లిని పట్టుకొని ఏడుస్తుంది దివ్య. ఏం జరిగింది అంటూ కంగారు పడతారు తులసి, నందు. ఏం జరిగింది ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ కంగారుగా అడుగుతాడు నందు. ఏమి చెప్పకపోతే ఎలా, మీ నాన్న చూడు ఎంత కంగారు పడుతున్నాడో అంటాడు పరంధామయ్య. ఏమీ లేదు పూజకు సంబంధించిన పనులు ఏవి చేయలేకపోతున్నాను నేను కోడలుగా పనికిరానా, అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దివ్య.
పెళ్లయిన కొత్తలో ఎవరైనా అంతే అయినా నేను వచ్చేసాను కదా అన్ని దగ్గరుండి చెప్తాను అంటుంది తులసి. ఇంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి ఏమంటుంది నా కోడలు అంటుంది. పనులు చేతకాక వాళ్ళ అత్తగారిని ఇబ్బంది పెడుతున్నాను అని బాధపడుతుంది అంటుంది తులసి. మా అమ్మ దేవత అమ్మ నీడలో ఉంటే ఆ దేవత నీడలో ఉన్నట్టే మీరేమీ మీ కూతురు గురించి బెంగ పెట్టుకోకండి అంటూ నందుకి ధైర్యం చెప్తాడు విక్రమ్. పంతులుగారు పూజ ప్రారంబిద్దాం అనటంతో పీఠల మీద కూర్చుంటారు దివ్య దంపతులు. పూజ పూర్తి అయిన తర్వాత పరంధామయ్య దంపతుల దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం తీసుకుంటారు విక్రమ్ దంపతులు.
నువ్వు పెంచిన గేదె పక్కింట్లో పాలిస్తుంది అంటూ రాజ్యలక్ష్మిని రెచ్చగొడతాడు బసవయ్య. రాజ్యలక్ష్మి దగ్గర ఆశీర్వచనం తీసుకున్న తర్వాత తులసి దంపతుల దగ్గర ఆశీర్వచనం తీసుకోబోతారు విక్రమ్ దంపతులు. వాళ్ళిద్దరూ దంపతులు కాదు, మీ ఆవిడని వదిలేసి ఈవిడతో షికార్లు చేస్తున్నారేంటి అంటూ అవమానంగా మాట్లాడుతాడు బసవయ్య. వాళ్ళిద్దరూ దివ్యకి అమ్మ, నాన్న.అయినా అది వాళ్ళ వ్యక్తిగత విషయం, పెళ్లిలోనే అమ్మ ఒప్పుకున్నది అంటే అదే ఫైనల్ డెసిషన్ మీరు మళ్ళీ కొత్త గొడవ ప్రారంభించొద్దు అంటూ బసవయ్యని అతని భార్యని మందలిస్తాడు విక్రమ్. నిజంగానే నేను పెంచిన గేదె అత్తింట్లో పాలిచ్చేలాగా ఉంది అనుకుంటుంది రాజ్యలక్ష్మి.
విక్రమ్ తనకి సపోర్ట్ గా మాట్లాడినందుకు చేతులెత్తి దండం పెడుతుంది తులసి. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులందరు. లాస్య కోరినట్లుగా నందు వాళ్ళని అవమానించడం జరిగింది ఈ విషయంలో విక్రమ్ దగ్గర నేను చెడ్డవ్వకూడదు అనుకుంటూ తులసి వాళ్ళకి క్షమాపణ చెప్తుంది రాజ్యలక్ష్మి. నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అంటాడు విక్రమ్. తమ్ముడు వాళ్ళు అంత హర్టింగ్ గా మాట్లాడుతుంటే నేను నోరు మూయించొచ్చు.
కానీ వాళ్ళ అనుమానాలు తీరాలి కదా అందుకే ఊరుకున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. వ్రతం పూర్తి అయింది కాబట్టి మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమని పంతులు గారికి చెప్తుంది రాజ్యలక్ష్మి. మరో రెండు వారాలు వరకు ముహూర్తం లేదు అంటారు పంతులుగారు. ఒకసారి గా షాక్ అవుతారు తులసి వాళ్ళు. అదేంటి వ్రతం అయిపోయిన వెంటనే ఫస్ట్ నైట్ అన్నారు కదా అంటుంది తులసి.
తరువాయి భాగంలో అల్లుడు కోటీశ్వరుడని వాళ్ళందరూ మురిసిపోతున్నట్లుగా ఉన్నారు, ఇప్పుడు వాడు కిందన కూర్చొని భోజనం చేస్తాడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ అల్లుడు ఎంత గొప్పవాడో అని అంటూ బసవయ్యకి చెప్తుంది రాజ్యలక్ష్మి. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే విక్రమ్ నేల మీద కూర్చొని భోజనం చేయడం చూసి షాక్ అవుతారు దివ్య, ఆమె పుట్టింటి వాళ్ళు.