Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్ పోస్ట్
Ashu Reddy: టాలీవుడ్ యంగ్ హీరో భరత్ కాంత్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మరణంతో ఆషురెడ్డి తల్లడిల్లిపోయింది. తన హార్ట్ బ్రేక్ అయ్యిందంటూ కామెంట్ చేసింది. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషురెడ్డి
ఆషు రెడ్డి ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. ఆమె దాదాపు పది కోట్ల మోసం చేసిందని ఒక ఎన్ఆర్ఐ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకంగా కేసు కూడా పెట్టాడు. ఈ కేసు కోర్ట్ లో నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆషు రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసింది. అల్లాడిపోయింది. సోషల్ మీడియాలో తన బాధని వెల్లడించింది. హీరో మరణంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. మరి కారణం ఏంటనేది చూస్తే..

హీరో భరత్ కాంత్ కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. యంగ్ హీరో భరత్ కాంత్ కన్నుమూశాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కాంత్ మరణించాడు. ఆయనతోపాటు సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా కన్నుమూశారు. ఈ ఘటనతో టాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది. భరత్ కాంత్ `టెనెంట్` అనే చిత్రంలో నటించారు. పలు వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. భరత్ కాంత్, త్రిలోక్ మరణంతో ఇండస్ట్రీ సంతాపం తెలియజేస్తుంది.
భరత్ కాంత్ మరణంపై ఆషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్
భరత్కాంత్ మరణంపై తాజాగా ఆషు రెడ్డి స్పందించింది. ఆమె ఎమోషనల్కి గురయ్యింది. భరత్ కాంత్ తనకు వ్యక్తిగతంగా చాలా దగ్గర కావాల్సిన వ్యక్తి అని చెప్పింది. `ఆయన మరణ వార్తని నమ్మలేకపోతున్నా, ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా. నా హార్ట్ బ్రేక్ అయిన పరిస్థితి. మనం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నీ ముఖంపై ఉన్న నవ్వు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నువ్వు నాపై చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. మీకు వీడ్కోలు` అని వెల్లడించింది ఆషు రెడ్డి. ఈసందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

