- Home
- Entertainment
- Aryan Rajesh: అల్లరి నరేష్ బ్రదర్ ఆర్యన్ రాజేష్ కమ్ బ్యాక్.. గ్రాండ్గా సినిమా స్టార్ట్.. అసలు ట్విస్ట్ ఇదే
Aryan Rajesh: అల్లరి నరేష్ బ్రదర్ ఆర్యన్ రాజేష్ కమ్ బ్యాక్.. గ్రాండ్గా సినిమా స్టార్ట్.. అసలు ట్విస్ట్ ఇదే
Aryan Rajesh: అల్లరి నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ మళ్లీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. అయితే ఈ సారి ఆయన నటుడిగా కాదు, కొత్త బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది.

ఆర్యన్ రాజేష్ కమ్ బ్యాక్
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకుల్లో చిన్నబ్బాయి అల్లరి నరేష్ హీరోగా రాణిస్తోన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ కూడా ఒకప్పుడు సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు ఆడకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మధ్యలో ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. తమ్ముడి లాగా ఆయన హీరోగా నిలబడలేకపోయాడు. దీంతో సైలెంట్ అయ్యాడు. సొంత వ్యాపారాలు చూసుకుంటున్నాడు.
ఆర్యన్ రాజేష్ని నిలబెట్టిన మూవీస్.. కమ్ బ్యాక్ మూవీ ఇదే
కానీ అప్పట్లో ఆర్యన్ రాజేష్.. `హాయ్`, `సొంతం`, `ఆడంతే అదోటైపు`, `లీలా మహల్ సెంటర్`, `ఎవడి గోల వాడిదే`, `నిరీక్షణ`, `నువ్వంటే నాకిష్టం`, `అనుమానాస్పదం` వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే నటుడిగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆ మధ్య `స్పై` మూవీలో మెరిశాడు. కానీ ఇది ఆడలేదు. దీంతో మళ్లీ సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు నటుడిగా కాదు, నిర్మాతగా మారుతున్నాడు. గతంలోనే ఆయన `బందిపోటు` చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆపేశారు. ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈవీవీ సినిమా ప్రొడక్షన్ పతాకంపై ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఇప్పుడు కొత్తగా సినిమా తీస్తున్నారు. ఎస్వీకృష్ణారెడ్డి కూడా దీనికి మరో నిర్మాత కావడం విశేషం.
రియలిస్టిక్ లవ్ స్టోరీతో నయా ఫిల్మ్
ఇందులో `కోర్ట్` ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా ప్రియాంక ఆచర్ చేస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. `కోర్ట్` చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, తెలుగు సినిమాలో ప్రతిభావంతులైన యువ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమకథను రూపొందించబోతున్నారు. ఈ సినిమా ఇటీవల శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, తీవ్ర భావోద్వేగాలు, బలమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది అని టీమ్ చెప్పింది. సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

