- Home
- Entertainment
- Amitabh Bachchan: అమితాబ్ సినిమాలో 26 మంది స్టార్లు, ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చిన మూవీ ఏంటో తెలుసా?
Amitabh Bachchan: అమితాబ్ సినిమాలో 26 మంది స్టార్లు, ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చిన మూవీ ఏంటో తెలుసా?
Amitabh Bachchan: అమితాబ్న టించిన 'నసీబ్' సినిమా విడుదలై 45 ఏళ్లు పూర్తయింది. ఈ మల్టీస్టారర్ సినిమా 1981 మే 1న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో దాదాపు 26 మంది స్టార్లు నటించారు.

నసీబ్లో స్టార్స్ హల్చల్
'నసీబ్' సినిమాలో దాదాపు 14 మంది స్టార్లు అతిథి పాత్రల్లో కనిపించారు. అమితాబ్ బచ్చన్పై చిత్రీకరించిన 'జాన్ జానీ జనార్దన్' పాటలో వీళ్లంతా సందడి చేశారు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, రణధీర్ కపూర్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, రాకేష్ రోషన్, విజయ్ అరోరా, వహీదా రెహమాన్, షర్మిలా ఠాగూర్, మాలా సిన్హా, బిందు, సిమి గరేవాల్, సింపుల్ కపాడియా, ప్రేమ నారాయణ్ ఈ పాటలో కనిపించారు. వీరిలో ఆరుగురు స్టార్లు ఇప్పుడు మన మధ్య లేరు.
అమితాబ్, శత్రుఘ్న సిన్హా చివరి మూవీ
అమితాబ్ నసీబ్ 26 మంది స్టార్స్ సందడి
హీరోయిన్ మారిపోయింది
7.5లక్షల ఖర్చుతో సెట్.. దుమ్మురేపిన పాట ఇదే
'నసీబ్' సినిమాలోని 'రంగ్ జమాకే జాయేంగే' పాటకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన్మోహన్ దేశాయ్ ఈ పాటను నిజమైన రివాల్వింగ్ రెస్టారెంట్లో షూట్ చేయాలనుకున్నారు. కానీ, అప్పట్లో ముంబైలో ఉన్న రెస్టారెంట్లు చాలా వేగంగా తిరిగేవి. దీంతో, ఆయన మేనల్లుడు డానీ దేశాయ్ రూ.7.5 లక్షల ఖర్చుతో ఒక సెట్ను నిర్మించారు. సినిమా క్లైమాక్స్ను కూడా ఇక్కడే చిత్రీకరించారు. చివరికి ఈ సెట్ను తగలబెట్టేశారు. ఇలా ఈ పాటలో బాలీవుడ్ మొత్తం మెరిసింది.

