అల్లు అర్జున్- అట్లీ మూవీ పూనకాలు తెప్పించే వార్త.. బన్నీ త్రిబుల్ రోల్
`పుష్ప 2` సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సైన్స్ ఫిక్షన్గా అల్లు అర్జున్-అట్లీ మూవీ
`పుష్ప 2` సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ `AA22`. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయట.
హీరో, విలన్, యానిమేషన్ రోల్ మూడు బన్నీనే
ఈ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే వార్త వినిపిస్తుంది. ఇందులో బన్నీ త్రిబుల్ రోల్ చేస్తున్నారట. హీరోగా, విలన్ గా, అనిమేషన్ క్యారెక్టర్ - ఇలా మూడు రకాల పాత్రలు చేస్తున్నాడట. దీనికోసం అట్లీ ఇంటర్నేషనల్ VFX టీం తో వర్క్ చేస్తున్నాడు.
700 కోట్ల బడ్జెట్తో బన్నీ-అట్లీ మూవీ
700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించే ఛాన్స్ ఉందట. 2026లోగానీ, 2027 లోగానీ ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
బన్నీకి మూడు వందల కోట్లు, దర్శకుడికి వంద కోట్లు
అల్లు అర్జున్ ఈ సినిమాకి రూ.300 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. అట్లీ 100 కోట్లు తీసుకున్నాడట. ఇండియన్ సినిమాలో ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరో, దర్శకుడు ఎవరూ లేరు.
గ్లోబల్ మార్కెట్పై బన్నీ, అట్లీ కన్ను
`పుష్ప 2`తో ఇండియన్ సినిమా బాక్సాఫీసుని షేక్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు అట్లీ మూవీతో వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్ల టార్గెట్తో ఈ మూవీని చేయబోతున్నారని తెలుస్తుంది.