- Home
- Entertainment
- Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Trisha Krishnan: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో '44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది' అనే వీడియోను షేర్ చేసి, 'ఆమెన్' అని రాశారు. సరిగ్గా ధనుష్ పుట్టినరోజున ఈ పోస్ట్ పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా? ఆమె ఏం చెప్పదలుచుకుంటుంది?

త్రిష పెట్టిన ఆసక్తికరమైన పోస్ట్!
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఈమధ్య కాలంలో ఏదో ఒక రకంగా వైరల్ న్యూస్ అవుతూ వస్తోంది. మొన్నటి వరకూ దళపతి విజయ్ విషయంలో త్రిష పేరు ముడిపెడుతూ.. వార్తలు వచ్చాయి.. ఇక తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. త్రిష సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈసారి ఆమె షేర్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా, నటుడు ధనుష్ పుట్టినరోజున ఈ పోస్ట్ పెట్టడంతో చాలామందిలో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి?
జీవితంపై స్పష్టత వస్తుంది
దానికి ఓప్రా విన్ఫ్రే బదులిస్తూ, 'నేను 30 ఏళ్లకు తిరిగి వెళ్లాలనుకోను. నిజానికి, అసలు జీవితం 44 ఏళ్లకే మొదలవుతుంది. ఆ వయసులోనే మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఇతరులను మెప్పించాలనే ఒత్తిడి తగ్గుతుంది. మన లక్ష్యం ఏంటి, దేనికోసం బతుకుతున్నాం అనే స్పష్టత వస్తుంది. ఇతరుల అంచనాల కోసం కాకుండా, మనకోసం బతకడం మొదలుపెట్టే సమయం అది' అని చెప్పారు.
ఓప్రా విన్ఫ్రే చెప్పిన '44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది' అనే మాట ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంది. జీవితంలోని ప్రతి దశలోనూ మనుషులు తమను తాము కొత్తగా కనుగొనగలరని, వయసు పెరగడం అనేది ఎదుగుదలకు అడ్డంకి కాదని ఆ మాట నొక్కి చెబుతుంది. ముఖ్యంగా, వృత్తి, కుటుంబం, వ్యక్తిగత లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ సాధించే కాలంగా మధ్య వయసును చాలామంది సైకాలజిస్టులు కూడా చెబుతారు.
ఇదే అసలు నిజం
ఈ వీడియోనే త్రిష తన స్టోరీలో షేర్ చేసి, దానితో పాటు 'ఆమెన్' (Amen) అని ఒకే ఒక్క పదం రాశారు. సాధారణంగా 'ఆమెన్' అంటే 'అలాగే జరగాలి', 'నేను దీనికి పూర్తిగా అంగీకరిస్తున్నాను' లేదా 'ఇదే నిజం' అనే అర్థంలో వాడతారు. కాబట్టి, ఓప్రా అభిప్రాయంతో త్రిష పూర్తిగా ఏకీభవిస్తున్నారని అర్థం అవుతుంది.
త్రిష షేర్ చేసిన ఈ ఒక్క స్టోరీ, కేవలం సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే కాదు, జీవితం గురించి లోతైన ఆలోచనను అభిమానుల్లో రేకెత్తించింది. 'వయసు పెరగడం ముఖ్యం కాదు; అనుభవంతో మనల్ని మనం అర్థం చేసుకుని, మనకోసం బతకడం మొదలుపెట్టే క్షణమే నిజమైన కొత్త జీవితానికి నాంది' అనే ఓప్రా విన్ఫ్రే అభిప్రాయాన్ని త్రిష తన 'ఆమెన్' అనే ఒక్క మాటతో బలంగా చెప్పినట్టయింది.
సంతృప్తే అసలైన సంపద
గత మే నెలలో తన 43వ పుట్టినరోజు జరుపుకున్న త్రిష, ఇప్పుడు తన జీవితంలోని కొత్త దశను చాలా పాజిటివ్గా చూస్తున్నారని ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అనుభవం, ఆత్మవిశ్వాసం, సంతృప్తి జీవితానికి అసలైన సంపద అని ఈ పోస్ట్ పరోక్షంగా చెబుతోంది.
దానికి, దీనికి సంబంధం లేదు?
ఈ పోస్ట్ పెట్టిన రోజు నటుడు ధనుష్ పుట్టినరోజు కావడంతో, సోషల్ మీడియాలో ఇది మరింత ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. అయితే, త్రిష పోస్ట్ నేరుగా ధనుష్ను ఉద్దేశించి కానీ, అతని పుట్టినరోజుకు సంబంధించి కానీ పెట్టలేదు. కానీ ఇద్దరూ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ఈ పోస్ట్ వచ్చిన టైమింగ్ వల్ల అభిమానులు రకరకాల కోణాల్లో చర్చించుకుంటున్నారు.
సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉండే హీరోయిన్..
త్రిష ప్రస్తుతం తమిళంలోనే కాకుండా, సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీయెస్ట్ నటీమణులలో ఒకరిగా ఉన్నారు. ఆమె వరుసగా అగ్ర దర్శకులు, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన కెరీర్లో కొత్త శిఖరాలను అందుకుంటున్నారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, ఇండస్ట్రీలో, అభిమానుల్లో ఆమెకున్న క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

