- Home
- Entertainment
- నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం
నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం
మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మిస్ వరల్డ్ ఫైనల్స్
హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది దశకి చేరుకున్నాయి. మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలే తో మిస్ వరల్డ్ పోటీలు ముగుస్తాయి. 2024 లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన క్రిస్టినా ఈ ఏడాది విజేతగా నిలిచే సుందరీమణికి కిరీటం అందజేస్తారు. క్రిస్టినా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మహిళ.
ఈసారి కిరీటం ఎవరిది
అయితే ఈసారి మిస్ వరల్డ్ కిరీటం ఏ దేశానికి చెందిన మోడల్ కి దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది. మొత్తం 108 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే నందిని గుప్తా టాప్ 40 లో అర్హత సాధించారు.
మిస్ వరల్డ్ పోటీల్లో తిరుగులేని భారత్
మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే. అంటే మిస్ వరల్డ్ టైటిల్స్ లో మనమే అగ్రస్థానంలో ఉన్నాం. 1966లో తొలిసారి ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ముంబై కి చెందిన రీటా ఫరియా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది
ఇండియాకి పోటీ ఇస్తున్న బుల్లి దేశం
ఆ తర్వాత 1994 లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని సంచలనం సృష్టించింది. 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో మనం మాత్రమే నెంబర్ వన్ కాదు. చిన్న ట్విస్ట్ ఉంది. 2.8 కోట్ల జనాభా కలిగిన బుల్లి దేశం వెనుజులా కూడా ఇండియాకి సమానంగా మిస్ వరల్డ్ పోటీల్లో ఆరు టైటిల్స్ సాధించింది. ఆ దేశం తరపున 1995, 1981, 1984, 1991, 1995, 2011 సంవత్సరాలలో సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు.
రేసులో నందిని గుప్తా
ఇండియా, వెనుజులా తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఐదు టైటిల్స్ తో రెండవ స్థానంలో ఉంది. ఈసారి ఇండియా తరపున నందిని గుప్తా టైటిల్ సాధిస్తే మనమే నెంబర్ 1 అవుతాం. మిస్ వరల్డ్ 2025 కిరీటం ఎవరిది అనేది శనివారం రోజు జరిగే ఫైనల్స్ లో తేలిపోనుంది.