- Home
- Entertainment
- Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Vijayashanti: విజయశాంతి ఎదుగుదల చూసి టాలీవుడ్ లో ఓ అగ్ర హీరో ఈర్ష్య పడ్డారట. మన హీరోలకు అంత బ్రాడ్ మైండ్ లేదు అంటూ విజయశాంతి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి
లేడీ అమితాబ్ అని, లేడీ సూపర్ స్టార్ అని విజయశాంతిని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. విజయశాంతి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్. కార్త్యవ్యం, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు విజయశాంతిని శిఖరాగ్రాన నిలబెట్టాయి.

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి
దీనితో విజయశాంతి సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా ఎదిగారు. ఈ క్రమంలో విజయశాంతిని చూసి కొందరు అగ్ర హీరోలు అసూయపడ్డారు అనే ప్రచారం ఉంది. ఓ ఇంటర్వ్యూలో విజయశాంతిని యాంకర్ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీరు తిరుగులేని స్టార్ గా ఎదగడం చూసి అప్పటి మెగాస్టార్ ఒకరు ఈర్ష్య పడ్డారు అనే టాక్ ఉంది. నిజమేనా అని ప్రశ్నించారు.
వాళ్ళు మారాలని ఆశించడం కూడా వేస్ట్
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన హీరోలు బ్రాడ్ మైండ్ తో ఆలోచించరు. పెద్ద మనసుతో ఆలోచించేవాళ్ళు లేరు. ఒకరిని చూసి ఎందుకు బయపడతారో, అసూయా పడతారో అర్థం కాదు. అరె మనతో కలసి పనిచేసిన హీరోయిన్ ఇంత గొప్ప స్థాయికి చేరుకుంది అని సంతోషించే వాళ్ళు లేరు. మన హీరోలు ఆ విధంగా మారరు. మారాలని ఆశించడం కూడా వేస్ట్ అని అన్నారు.
అసహ్యం వేసింది
మన హీరోలు మైండ్ సెట్ పరంగా ఇంకా ఎదగలేదు అని విజయశాంతి అన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. శత్రువులు వెనుక నుంచే దెబ్బ తీస్తారు అని విజయశాంతి అన్నారు. కానీ నాకు కొందరు హీరోల గురించి తెలిసింది. వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఇలాంటి వాళ్ళతోనా నేను కలసి నటించింది అనే అసహ్యం వేసినట్లు విజయశాంతి తెలిపారు.
రాజకీయ విమర్శలు
అలాంటి హీరోలు ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్నారు. అందరూ టాప్ హీరోలే అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీతో కలసి నటించిన హీరోలపైనే తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు ఎందుకు అని అడుగగా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నటించిన హీరోలు, నా వాళ్ళు అనేది అస్సలు పట్టించుకోను. తప్పు జరుగుతుంది అని తెలిస్తే తప్పకుండా నిలదీస్తా అని విజయశాంతి అన్నారు.

