నేను షారూఖ్కి అభిమానిని.. అందుకు సారీ మాత్రమే చెప్పగలను.. మాధవన్ ఛాటింగ్
ఆర్ మాధవన్.. తమిళ విలక్షణ నటుడు. రొమాంటిక్ పాత్రలతో ఆడియెన్స్ కి దగ్గరైన నటుడు. హీరోగానే కాదు.. విలన్గానూ తన నట విశ్వరూపం చూపించిన నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి భాషల్లో సినిమాలు చేస్తూ తన వర్సటాలిటీని చాటుకుంటున్నారు.
తాజాగా ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మరి మాధవన్ క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందనేది తెలుసుకుంటే.. ఇటీవల మల్టీలింగ్వల్గా రూపొందిన `నిశ్శబ్దం` చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో పాత్ర ఆయనది. ఇందులో అనుష్క, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మాడిసన్ ప్రధాన పాత్రలు పోషించారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 2న సినిమా విడుదలైంది. దీనికి కాస్త నెగటివ్ టాక్ కూడా వస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ అంతగా నప్పలేదు. దీంతో అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.
తాజాగా మాధవన్ ట్విట్టర్ లో నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సినిమా ఫ్లాష్బ్యాక్ కన్విన్సింగ్గా లేద`ని ప్రశ్నించారు. దీనికి మాధవన్ స్పందిస్తూ, ఇప్పుడు నేను కేవలం క్షమాపణలు మాత్రమే చెప్పగలను` అని రిప్లై ఇచ్చారు.
ఇంకా ఆయన ముచ్చటిస్తూ, తనకిష్టమైన సినిమా `సఖి` అని, తాను అద్భుతంగా నటించిన పాత్ర `రాకెట్రీ` అని, ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.
హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్తో నటించడం ఓ మధుర జ్ఞాపకం అన్నారు. షారూఖ్ ఖాన్కి తాను అభిమానిని అని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.
తెలుగులో ప్రస్తుతం ఓ పాజిటివ్ రోల్ చేస్తున్నానని చెప్పారు. గతంలో `సవ్యసాచి`లో నెగటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే.
హీరో సూర్య ఇష్టమైన సోదరుడని, హీరో విజయ్ అద్భుతమైన వ్యక్తి అని, తన ఫ్యామిలీ సభ్యుడిలా భావిస్తానని తెలిపారు. తాను అందంగా ఉన్నాననేది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుందన్నారు. విజయ రహస్యం చెబుతూ, ఇంకా తాను నేర్చుకుంటున్నాని పేర్కొన్నారు.
స్వీటీతో నటించడం మంచి అనుభూతినిచ్చిందని, ఆమె సౌమ్యమైన మహిళ అని పేర్కొంది. `నిశ్శబ్దం`లో ఏం నచ్చి నటించారన్న ప్రశ్నకు మాధవన్ స్పందిస్తూ, కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, మరికొన్నిసార్లు పరాజయం చెందడం జరుగుతుంది. అంతకు మించి ఏం చెప్పలేన`న్నారు.