Praksh raj:ఫైర్ బ్రాండ్ ప్రకాష్ రాజ్ సడన్ గా సైలెంట్.. ఆయన మౌనవ్రతం వెనుక కారణం ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA elections) ఎన్నికలు చిత్ర పరిశ్రమలో ఎంతటి రాద్ధాంతం సృష్టించాయో చూశాం. సెలబ్రిటీ హోదాలో ఉన్న చిత్ర ప్రముఖులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోడ్డున పడ్డారు. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లో తిట్టుకోవడాలు, నెట్టుకొవడాలు, చివరికి కొరుక్కోవడాలు కూడా చేశారు.
Prakash Raj
ఇరు ప్యానెల్స్ కి మిక్స్డ్ ఫలితాలు రావడం జరిగింది. అయితే మంచు విష్ణు ప్యానెల్ కీలకమైన అధ్యక్ష పదవితో పాటు మెజారిటీ పదవులు గెలుపొందారు. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా ఓడిపోయారు.అనంతరం ఎన్నికలలో అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులు రాజీనామాలు ప్రకటించారు.
prakash raj
పోలింగ్ బూత్ లోని సీసీ టీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ (Prakash raj)ఎన్నికల అధికారిని డిమాండ్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ విషయంలో కొంచెం హైడ్రామా నడిచింది. మా సభ్యులు కానివారు పోలింగ్ బూత్ లో కనిపించారని, రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేయడం జరిగింది.
ఫలితాల అనంతరం కూడా ఏదో ఒక ఆరోపణ చేస్తూ... వివాదాన్ని ముందుకు తీసుకెళుతున్న ప్రకాష్ రాజ్ చర్యల వెనుక రాజకీయ అజెండా ఉందని కొందరు భావించారు. మా ఎన్నికలలో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కి పూర్తి సప్పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన (Janasena) కు విరోధిగా ఉన్న వైసీపీ పార్టీని ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తున్నారని ఊహాగానాలు తలెత్తాయి.
నాగబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చిరంజీవి (Chiranjeevi) పరోక్షంగా ప్రకాష్ రాజ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అతడు జనసేన పార్టీలో చేరి... ఆ పార్టీలో కీలక నేతగా మారనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. గతంలో రాజకీయంగా పవన్ (Pawan kalyan) పై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ జనసేనకు దగ్గర కావడం, పవన్ లో పరివర్తన వచ్చిందని చెప్పడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.
గతంలో రాజకీయంగా పవన్ (Pawan kalyan) పై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ జనసేనకు దగ్గర కావడం, పవన్ లో పరివర్తన వచ్చిందని చెప్పడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.
మా ఎన్నికలకు ముందు ఓ తమిళ్ మూవీ షూటింగ్ లో ప్రకాష్ రాజ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు సర్జరీ కూడా జరిగింది. ఇక తన మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్, నటుడిగా కొనసాగుతానని చెప్పిన విషయం తెలిసిందే.
Also read RRR మూవీపై తీవ్ర ప్రభావం నిజమే, కోర్టుకి వెళ్లడం లేదు.. డైరెక్ట్ గా సీఎం జగన్ తోనే..