- Home
- Entertainment
- 'మయసభ' ట్రైలర్ చూశారా.. నీవాళ్ళ ఉనికి కాపాడడం నీ ధర్మం, నా వాళ్ళ ఉనికి కాపాడడం నా ధర్మం
'మయసభ' ట్రైలర్ చూశారా.. నీవాళ్ళ ఉనికి కాపాడడం నీ ధర్మం, నా వాళ్ళ ఉనికి కాపాడడం నా ధర్మం
దేవాకట్టా తెరకెక్కించిన మయసభ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ ఎలా ఉంది, సాయి దుర్గ తేజ్ ఏం మాట్లాడారు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి.

మయసభ ట్రైలర్ లాంచ్
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ సినీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం రోజు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహాన్ని, పొలిటికల్ జర్నీని చూపించబోతున్నారు. చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో చైతన్య రావు నటించారు. అయితే వారి పాత్రల పేర్లు మాత్రం మార్చారు. ఆది పినిశెట్టి కృష్ణమ నాయుడుగా.. చైతన్య రావు ఎం ఎస్ రామిరెడ్డిగా నటిస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సిరీస్ పై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. నీవాళ్ళ ఉనికి కాపాడడం నీ ధర్మం.. నా వాళ్ళ ఉనికి కాపాడడం నా ధర్మం లాంటి డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్ లంచ్ ఈవెంట్ కి సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
KNOW
సాయి దుర్గ తేజ్ కామెంట్స్
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా గారి కోసం ఇలా ఈవెంట్కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్లో చైతన్య విలన్లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణం
దేవా కట్టా మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన మా డియర్ బ్రదర్ తేజ్కు థాంక్స్. ‘మయసభ’ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్లా ఓ సీజన్ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ధనీష్ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్కి కూడా విజయ్ బ్యాక్ బోన్లా నిలిచారు. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.
ఆది పినిశెట్టి కామెంట్స్
ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. ‘మా ఈవెంట్కు వచ్చి సపోర్ట్ చేసిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం దేవా కట్టా గారు పని చేస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్న సోనీ లివ్ టీంకు థాంక్స్. దేవా గారు కన్న కలను ‘మయసభ’ టీం నిజం చేసింది. శక్తి ఇచ్చిన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సిరీస్లో అందరూ అద్భుతంగా నటించారు. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యా దత్త గారు ఇలా ప్రతీ ఒక్కరూ అందరూ గొప్పగా నటించారు. చైతన్య రావ్ అద్భుతమైన నటుడు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్లోకి రాబోతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’లా ‘మయసభ’ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
చైతన్య రావు కామెంట్స్
చైతన్య రావ్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన తేజ్కు థాంక్స్. దేవా కట్టా గారు చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు కిరణ్ అన్న ఎంతో సహకరించారు. శక్తి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత హర్ష గారు చాలా మంచి వ్యక్తి. దివ్యా మేడం, నాజర్ సర్, సాయి కుమార్ వంటి యాక్టర్లతో పని చేయడం అదృష్టం. ఆదితో నటించడం ఛాలెంజింగ్గా అనిపించింది. ఆది నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నా ప్రయాణంలోని ప్రతీ మైల్ స్టోన్లో నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని అన్నారు.