MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వందల మంది ప్లేయర్లతో ఆడినా బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఎందుకు ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాయి?

వందల మంది ప్లేయర్లతో ఆడినా బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఎందుకు ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాయి?

IPL 2025:  ఇప్పటివరకు 17 ఐపీఎల్ సీజన్లు  పూర్తయ్యాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు అద్భుతమైన ఆటతో అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లుగా నిలిచాయి. అయితే తొలి ఎడిషన్‌ నుంచి ఆడుతున్న ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ టీమ్ లు ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. ఎందుకు ఈ జట్లు సక్సెస్ కాలేకపోతున్నాయి? 

3 Min read
Mahesh Rajamoni
Published : Aug 30 2024, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్‌లో ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. కోట్లలో డబ్బు సంపాదించే అవకాశంతో పాటు ఇంకా అరంగేట్రం చేయని ప్లేయర్లు తమ సత్తాను నిరూపించుకోవడానికి అద్భుతమైన వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 17 సీజన్లు పూర్తయ్యాయి. కానీ, ఈ క్రమంలో ఏ ఒక్క ఆటగాడు కూడా నష్టపోలేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అద్భుత ప్రదర్శన చేసి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన  చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయ జట్లలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న దేశీయ, విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. 

 

27

ఐపీఎల్ తో ప్లేయర్లకు మంచి గుర్తింపు లభించింది. కానీ, ఇప్పటికీ పలు జట్లు మాత్రం టైటిల్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. మొత్తం 17 ఐపీఎల్ సీజన్లు పూర్తికాగా, ఇప్పటికీ టైటిల్ గెలవని జట్లు ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్స్ గా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నిలిచాయి. అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్లుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచాయి.

37

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ విజయవంతమైన టీమ్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు కేకేఆర్ మూడు ఐపీఎల్ ట్రోఫీల‌ను గెలుచుకుంది. ఆ త‌ర్వాత సన్ రైజ‌ర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, డెక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్లు ఒక్కోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాయి.

47

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి ట్రోఫీ గెలవని జట్లు కూడా ఉన్నాయి. అలాంటి టీమ్స్ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మొద‌టగా వినిపిస్తుంది. ఆ త‌ర్వాత‌ ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో, పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ జ‌ట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు గొప్పగొప్ప ప్లేయ‌ర్ల‌తో బ‌రిలోకి దిగినా ఒక్క‌సారి కూడా ఐపీఎల్ ట్రోఫీని అందుకోవ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయాయి. 

57

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో బలమైన జట్లలో ఆర్సీబీ ఒకటి. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఆర్సీబీ 165 మంది ఆటగాళ్లను మార్చినా ట్రోఫీ గెలవలేకపోయింది. దీనికి ప్రధాన కారణం జట్టులో ఐక్యత లేకపోవడమే. ప్ర‌తిసారి కూడా ఆ జ‌ట్టు క‌లిసి పోరాటం చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంది. ఒక ప్లేయ‌ర్ రాణిస్తే ఇత‌ర ప్లేయ‌ర్లు చేతులెత్తేయ‌డం చాలా మ్యాచ్ ల‌లో చూశాం. అలాగే, బ్యాట‌ర్లు రాణించిన స‌మ‌యంలో బౌల‌ర్లు విఫ‌లం కావ‌డం, బౌలింగ్ బాగున్న స‌మ‌యంలో బ్యాట‌ర్లు చెత్త ప్ర‌ద‌ర్శన చేయ‌డం వంటి కార‌ణాలు ఆర్సీబీ టీమ్ ను ఛాంపియ‌న్ కావ‌డాన్ని అడ్డుకుంటున్నాయి. 

67

ఐపీఎల్ ట్రోఫీ కోసం గ‌ట్టి పోటీ ఇచ్చినా ఇప్ప‌టివ‌ర‌కు అందుకోలేకోయిన రెండో స్థానంలో ఉన్న టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ జ‌ట్టు త‌ర‌ఫున ప్రారంభ సీజ‌న్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 159 మంది ఆటగాళ్లను మార్చింది. కానీ ట్రోఫీని మాత్రం గెలుచుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ జ‌ట్టు ప్ర‌ధాన స‌మ‌స్య‌ ఆత్మవిశ్వాసం లోపించడం. అలాగే, కీల‌క‌మైన మ్యాచ్ ల‌లో ఆటగాళ్ల వైఫల్యం ప్ర‌ధాన కార‌ణంగా ఉంది. జ‌ట్టు న‌డిపించే నాయ‌కులు కూడా టీమ్ గా పోరాటం చేయ‌డంలో జ‌ట్టును ముందుకు న‌డిపించ‌డంలో బ‌ల‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. 

77

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్ర‌తి సీజ‌న్ లో బ‌ల‌మైన జ‌ట్టుగా బ‌రిలోకి దిగుతుంది. కానీ, స్టార్ ప్లేయ‌ర్లు చాలా మంది ఉన్నా ప్ర‌తిమ్యాచ్ లో వీరు రాణించ‌లేక‌పోవ‌డం పంజాబ్ ను దెబ్బ‌తీసింది. ప్రారంభ సీజ‌న్ నుంచి ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ 156 మంది ఆటగాళ్లను ఆడించింది. ఇదే స‌మ‌యంలో 10 మంది కెప్టెన్లను మార్చింది. కానీ ఛాంపియ‌న్ గా నిలిచే ప్ర‌యోజ‌నాన్ని పొంద‌లేక‌పోయింది. ముగ్గురు న‌లుగురు మిన‌హా ఇత‌ర ప్లేయ‌ర్లు బ‌లంగా ఉండ‌గ‌క‌పోవ‌డంతో పంజాబ్ అనుకున్న ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది. అలాగే, జ‌ట్టును న‌డిపించే స‌రైన నాయ‌కుడు పంజాబ్ కు లేక‌పోవ‌డం కూడా ఆ టీమ్ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బెంగళూరు
క్రికెట్
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved