IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచేది ఎవరు? సునీల్ గవాస్కర్ అంచనా జట్టు ఇదే
IPL 2025: 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే ఫేవరెట్ జట్టు ఏదో అంచనా వేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐపీఎల్ 2025
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి జట్టుగా ప్లేఆఫ్కు చేరుకుంది. ఆ తర్వాత పంజాబ్ ను ఓడించి ఫైనల్ చేరుకుంది. తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే కలలు కంటోంది.
ఆర్సీబీతో ఫైనల్ పోరులో తలపడేది ఎవరు?
ఇక రెండో స్థానంలో ఫైనల్కు చేరేందుకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ నెలకొంది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఆర్సీబి చేతిలో పంజాబ్ ఓటమి పాలైంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ఫామ్ లో ఆర్సీబీ
ఆర్సీబి-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ హైవోల్టేజ్ పోరుకు సాక్ష్యమిస్తుందని అందరూ భావించారు. కానీ ఆర్సీబి బౌలింగ్ దాడికి పంజాబ్ తట్టుకోలేక కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబి 10 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచేది ఆ జట్టేనా
18వ ఐపీఎల్ టోర్నమెంట్లో ఛాంపియన్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆర్సీబి జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. విరాట్ కోహ్లీ టీమ్ అద్భుతంగా ఆడుతోందని పేర్కొన్నారు.
అన్ని విభాగాల్లో బలంగా ఆర్సీబీ
ఆర్సీబి జట్టు ఈసారి ఒకరిద్దరు బ్యాట్స్మెన్ లేదా ఒక బౌలర్పై ఆధారపడి లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా జట్టు విజయానికి దోహదపడ్డారు అని సునీల్ గవాస్కర్ అన్నారు.
ఈసారి ఆర్సిబి కేవలం ఒకరిద్దరు బ్యాట్స్మెన్, ఒక బౌలర్పై ఆధారపడటం లేదు. జట్టు విజయానికి అందరూ ఏదో ఒక విధంగా దోహదపడ్డారని సునీల్ గవాస్కర్ అన్నారు.
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచేది ఆర్సీబీనే
ఆర్సీబి ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్కు చేరుకున్నప్పటికీ, ప్రతిసారీ రన్నరప్గానే నిలిచింది. ఇప్పుడు నాలుగోసారి ఫైనల్కు చేరిన ఆర్సీబి తొలి కప్పును గెలుచుకుంటుందని సునీల్ గవాస్కర్ అంచనా వేశారు.