MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • భార‌త్ కు బిగ్ షాకిచ్చిన శ్రీలంక‌

భార‌త్ కు బిగ్ షాకిచ్చిన శ్రీలంక‌

India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 110 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 07 2024, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
India , Cricket,

India , Cricket,

India vs Sri Lanka: శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు 2-0 తేడాతో కోల్పోయింది. మూడో మ్యాచ్ లో శ్రీలంక బౌలింగ్ దెబ్బ‌కు టీమిండియా ప్లేయ‌ర్ల‌లో ఒక్క‌రు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. దీంతో భార‌త్ ఘోర ఓట‌మిని చ‌విచూసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
India vs Sri Lankam, Virat,

India vs Sri Lankam, Virat,

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో బుధవారం (ఆగస్టు 7) జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ టై అయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో విజయం సాధించి లంక సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

35

ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఆవిష్క ఫెర్నాండో అత్యధికంగా 96 పరుగులు చేశాడు. కుసాల్ మెండిస్ 59 పరుగులు, పాతుమ్ నిస్సంక 45 పరుగులు చేశారు. అలాగే, కమిందు మెండిస్ 23 పరుగులు చేశాడు. భారత్ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు. 

45

249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 26.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియాలో కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ 35, వాషింగ్టన్ సుందర్ 30, విరాట్ కోహ్లీ 20, రియాన్ పరాగ్ 15 పరుగులు చేశారు.

 

55

మిగతా భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రీలంక తరఫున స్పిన్నర్ దునిత్ వెల్ల‌లాగే 5 వికెట్లు పడగొట్టాడు. అత‌నితో పాటు మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సేలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image3
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved