MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్-విరాట్ లు ఆడాల్సింది.. బీసీసీఐ తీరుపై సునీల్ గ‌వాస్క‌ర్ ఆందోళ‌న‌

రోహిత్-విరాట్ లు ఆడాల్సింది.. బీసీసీఐ తీరుపై సునీల్ గ‌వాస్క‌ర్ ఆందోళ‌న‌

Kohli-Rohit-Gavaskar : దులీప్ ట్రోఫీ 2024 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. దులీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాల్గొనడం లేదు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 19 2024, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Virat Kohli, RohitSharma

Virat Kohli, RohitSharma

Kohli-Rohit-Gavaskar : దులీప్ ట్రోఫీ 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాల్గొనకపోవడంపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కీలక బ్యాట్స్‌మెన్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే పాల్గొంటారని అన్నారు. 

25
Kohli-Rohit

Kohli-Rohit

అయితే, భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చినందుకు గవాస్కర్ ప్రశంసించాడు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం సానుకూల అంశంగానే పేర్కొన్నారు. కానీ, విరాట్, రోహిత్ లను ఎంపిక చేయాల్సిందని అన్నారు. 

35

రోహిత్-విరాట్‌లు దేశవాళీ మ్యాచ్‌లకు ఎంపికై ఉండాల్సింది ఎందుకంటే మ్యాచ్ సమయాన్ని పొందే అవకాశముండేదనీ, వారి ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశముండేదని అభిప్రాయపడ్డారు. క్రీడాకారుడు 30 ఏళ్లు దాటినప్పుడు కండరాలు బలహీనపడకుండా ఉండాలంటే నిత్యం ప్రాక్టీస్ లో ఉండాలని అన్నారు. 

45
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

మిడ్-డేలో సునీల్ గవాస్కర్ కాలమ్‌లో.. "సెలెక్టర్లు దులీప్ ట్రోఫీకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంచుకోలేదు. కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనున్నాడు. కానీ, బ్యాట్స్‌మెన్ పిచ్‌పై కొంత సమయం గడపాలి. ఒక క్రీడాకారుడు ఏదైనా క్రీడలో 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత, సాధారణ పోటీలు అతను నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలను కొనసాగించడంలో సహాయపడతాయి" అని పేర్కొన్నారు. 

 

55
Image credit: PTI

Image credit: PTI

కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2012, 2016లో తమ చివరి హోమ్ మ్యాచ్‌లు ఆడారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ 58, 64, 35 పరుగులు చేయగా, కోహ్లీ వరుసగా 24, 14, 20 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. జనవరి 2024లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు ఆడాడు. అక్క‌డ 46, 12 పరుగులు చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
Recommended image2
IND vs WI : వెస్టిండీస్‌తో చావో రేవో.. హోం గ్రౌండ్ లో రింకూ సింగ్ ఆడేనా?
Recommended image3
IND vs WI : భారత అభిమానులకు టెన్షన్.. విండీస్‌తో తలపడితే మనోళ్లకి గండమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved