MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే

Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే

Indian Cricketers Padma Shri: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 1982 నుండి ఈ అవార్డు అందుకున్న 16 మంది భారతీయ క్రికెటర్ల వివరాలు గమనిస్తే.. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రోహిత్ శర్మకు పద్మశ్రీ.. 19 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌లో మరో మైలురాయి
Image Credit : X/ImRo45

రోహిత్ శర్మకు పద్మశ్రీ.. 19 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌లో మరో మైలురాయి

టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు రోహిత్ శర్మ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ' అవార్డును రోహిత్ శర్మ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రోహిత్ ఈ అవార్డును స్వీకరించారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ అందించిన అసాధారణమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ స్టార్ బ్యాటర్, ఈ వేడుకకు తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. రాష్ట్రీయ భవన్‌లో అవార్డు తీసుకుంటున్న సమయంలో రోహిత్ ముఖంలో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
డెబ్యూ రోజునే అవార్డు.. హిట్ మ్యాన్ కెరీర్‌లో అరుదైన మ్యాజిక్
Image Credit : ANI

డెబ్యూ రోజునే అవార్డు.. హిట్ మ్యాన్ కెరీర్‌లో అరుదైన మ్యాజిక్

ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగిన రోజుకు ఒక పెద్ద హిస్టరీ ఉంది. అదేంటో తెలుసా? జూన్ 23, 2026 నాటికి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా 19 ఏళ్లు పూర్తయ్యాయి. కరెక్ట్‌గా తను టీమిండియా క్యాప్ ధరించిన రోజునే, దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందుకోవడం రోహిత్ కెరీర్‌లో ఒక మ్యాజికల్ మూమెంట్‌గా నిలిచిపోయింది.

2007లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్, తన తరం క్రికెటర్లలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్‌గా ఎదిగారు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఏకైక ప్లేయర్‌గా రోహిత్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేకపోయారు.

37
ముగింపు దశకు కెరీర్.. 2027 వరల్డ్ కప్‌పైనే గురి
Image Credit : ANI

ముగింపు దశకు కెరీర్.. 2027 వరల్డ్ కప్‌పైనే గురి

ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ, తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన కేవలం 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియా తరఫున ఆడుతున్నారు. క్రికెట్ సర్కిల్ టాక్ ప్రకారం.. 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆటను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. తన అద్భుతమైన కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఈ రకమైన గొప్ప గౌరవం దక్కడం రోహిత్‌కు ఒక పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పవచ్చు.

47
పద్మశ్రీ అందుకున్న ఎలైట్ గ్రూప్‌లో చేరిన రోహిత్ శర్మ !
Image Credit : Getty

పద్మశ్రీ అందుకున్న ఎలైట్ గ్రూప్‌లో చేరిన రోహిత్ శర్మ !

ఈ అవార్డును అందుకోవడం ద్వారా, పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్న కొద్దిమంది అరుదైన భారతీయ క్రికెటర్ల క్లబ్‌లో రోహిత్ శర్మ కూడా చేరిపోయారు. 1982 నుండి ఇప్పటివరకు మొత్తం 16 మంది ఇండియన్ క్రికెటర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ ఎలైట్ గ్రూప్‌లో మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీలతో పాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి దిగ్గజాలు ఉన్నారు.

57
భారత క్రికెట్‌లో ఏయే దిగ్గజాలు ఏయే సంవత్సరాల్లో ఈ అవార్డును అందుకున్నారు?
Image Credit : Gemini

భారత క్రికెట్‌లో ఏయే దిగ్గజాలు ఏయే సంవత్సరాల్లో ఈ అవార్డును అందుకున్నారు?

• 1982: కపిల్ దేవ్

• 1999: సచిన్ టెండూల్కర్

• 2004: రాహుల్ ద్రవిడ్

• 2005: అనిల్ కుంబ్లే

• 2009: ఎంఎస్ ధోనీ

• 2010: వీరేంద్ర సెహ్వాగ్

• 2011: వీవీఎస్ లక్ష్మణ్

• 2012: జులన్ గోస్వామి

• 2014: యువరాజ్ సింగ్

• 2015: మిథాలీ రాజ్

• 2017: విరాట్ కోహ్లీ

• 2019: గౌతమ్ గంభీర్

• 2020: జహీర్ Khan

• 2026: హర్మన్‌ప్రీత్ కౌర్

• 2026: రోహిత్ శర్మ

67
అవార్డు అందుకున్నాక రోహిత్ ఎమోషనల్ పోస్ట్.. బీసీసీఐ సెల్యూట్
Image Credit : Getty

అవార్డు అందుకున్నాక రోహిత్ ఎమోషనల్ పోస్ట్.. బీసీసీఐ సెల్యూట్

అవార్డు వేడుక ముగిసిన వెంటనే రోహిత్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన డెబ్యూ డేట్, అవార్డు డేట్ ఒకటే కావడంపై స్పందిస్తూ.. "జూన్ 23 అన్ని రకాల మ్యాజిక్‌లను మోసుకొచ్చింది. 19 ఏళ్ల క్రితం, ఒక ఇండియా క్యాప్‌తో నా ప్రయాణం మొదలైంది. ఈరోజు, నా లైఫ్ స్టోరీలో మరో గర్వించదగ్గ అధ్యాయం తోడైంది" అంటూ రాసుకొచ్చారు.

మరోవైపు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా రోహిత్ శర్మ అవార్డు తీసుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ గ్రాండ్‌గా అభినందనలు తెలిపింది. "క్రికెట్ ప్రపంచంలోని ఒక గొప్ప దిగ్గజానికి దక్కిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవం ఇది. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, మాజీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు" అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

77
పద్మశ్రీ అవార్డు అందుకోవడం నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణం: రోహిత్
Image Credit : Getty

పద్మశ్రీ అవార్డు అందుకోవడం నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణం: రోహిత్

గతంలో ఈ అవార్డు ప్రకటన వచ్చినప్పుడు రోహిత్ శర్మ దూరదర్శన్‌కు ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో తన సంతోషాన్ని పంచుకున్నారు. "పద్మశ్రీ అవార్డు అందుకోవడం నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణం. ఈ గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. నా కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. దేశం కోసం మరిన్ని మ్యాచ్‌లు, ట్రోఫీలు గెలవడానికి నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. థాంక్యూ.. జై హింద్" అని అప్పట్లో రోహిత్ చెప్పారు. 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలి కాలంలో అద్భుతమైన విజయాలు సాధించింది. 2024లో సౌతాఫ్రికాను ఓడించి టీ20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడింది. ఈ విజయాలతో వైట్ బాల్ క్రికెట్‌లో ఇండియాస్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా రోహిత్ శర్మ తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Recommended image3
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Related Stories
Recommended image1
Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !
Recommended image2
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved