RCB: ప్రత్యర్థి ఎవరైనా సరే ఆర్సీబీదే ఐపీఎల్ 2025 టైటిల్ !
RCB: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ పై విక్టరీతో ఆర్సీబీ ఫైనల్ లోకి ప్రవేశించింది. అయితే, ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందని ఒక లెజెండరీ ప్లేయర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందని లెజెండరీ క్రికెటర్ ఖచ్చితంగా చెప్పారు. ఆర్సీబీ కప్ ఎందుకు గెలుస్తుందో కారణాలను కూడా వివరించారు.
IPL 2025 ఫైనల్లో ఆర్సీబీదే గెలుపు !
ఆస్ట్రేలియా జట్టు సీనియర్ ఆటగాడు, లెజెండరీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఐపీఎల్ 2025 విజేతగా ఎవరు నిలుస్తారో చెప్పారు. షేన్ వాట్సన్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఐపీఎల్ 2025 విజేత ఎవరో నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నా. నా దృష్టిలో ఆర్సీబీ ఛాంపియన్ అవుతుంది. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారు" అని షేన్ వాట్సన్ అన్నారు.
సూపర్ ఫామ్ లో ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ సూపర్ ఫామ్ లో ఉంది. ఐపీఎల్ 2025 లో మంచి ఆరంభం తర్వాత ద్వితీయార్థంలో కొన్ని కఠినమైన మ్యాచ్లను ఎదుర్కొంది. విరాట్ కోహ్లీకి తోడుగా ఇప్పుడు జోష్ హేజిల్ వుడ్ తిరిగి జట్టులోకి రావడంతో ఈ సంవత్సరం ఆర్సీబీ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉందని వాట్సన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
IPL 2025 ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ !
ఫైనల్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారని షేన్ వాట్సన్ అన్నారు. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్లలో 60.20 సగటుతో 602 పరుగులు చేశారు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాబట్టి ఫైనల్లో విరాట్ కోహ్లీ అదరగొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో బిగ్ ఇన్నింగ్స్ వస్తుందని చెప్పారు.
9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరిసారిగా 2016లో ఐపీఎల్ ఫైనల్ ఆడింది. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఫైనల్ ఆడనుంది. జూన్ 3న 18వ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.