MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు - అత్యంత విలువైన భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు - అత్యంత విలువైన భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

Most Valuable Indian Cricketer : భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మను కాదని అశ్విన్ భారత్ క్రికెట్ లో అత్యంత విలువైన క్రికెటర్ గా మరో ప్లేయర్ ను పేర్కొన్నాడు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఏం జరిగింది?    

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 15 2024, 11:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కు బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు భారత జట్టులో చోటు దక్కింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. స్వదేశంలో సిరీస్ ఆరంభానికి ముందు 37 ఏళ్ల అశ్విన్ 100 టెస్టులు ఆడి 517 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Most Valuable Indian Cricketer

Most Valuable Indian Cricketer

ఈ క్రమంలోనే 30 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయనను ఎంతో విలువైన వ్యక్తిగా అభివర్ణించారు.  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్లను కాదని భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అత్యంత విలుబైన భారత క్రికెటర్ గా పేర్కొన్నాడు. 

బ్యాట్స్ మెన్ల రికార్డులతో సెలబ్రేట్ చేసుకునే దేశంలో బుమ్రాను ఛాంపియన్ గా పేర్కొంటూ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని అశ్విన్ తెలిపాడు. బుమ్రాను ఛాంపియన్ గా పరిగణించాలని 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అశ్విన్ అన్నాడు.

2016లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో ఫార్మాట్‌లలో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా మారాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 195 మ్యాచ్‌ల్లో 397 వికెట్లు తీశాడు.

35

తన యూట్యూబ్ ఛానెల్‌లో జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో అశ్విన్ మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడూ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించే దేశం. కానీ, నేను బుమ్రా వేడుకలను ఆనందిస్తున్నాను. బుమ్రా ఒక తరం బౌలర్. చెన్నై వాసులుగా మేము బౌలర్లను చాలా ఆరాధిస్తాం. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చెన్నై వచ్చారని' చెప్పారు. అలాగే,

అలాగే, 'మేం చెన్నై వాసులు బౌలర్లను బాగా ఆదరిస్తాం. బుమ్రాను చాంపియన్‌గా పరిగణించాలి. బుమ్రా ఇప్పుడు అత్యంత విలువైన భారత క్రికెటర్' అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా,  గాయం కారణంగా బుమ్రా 2022 టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. గతేడాది గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

45

2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో 11 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. 2024 ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా 19 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 2వ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంక్‌ను అందుకున్నాడు.

ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన దాదాపు 8 నెలల తర్వాత భారత్ టెస్టు సిరీస్ లో పాల్గొంటోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 

55
Most Valuable Indian Cricketer

Most Valuable Indian Cricketer

ఈ జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. బుమ్రా చివరిసారిగా టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ఎంఏ చిదంబరం స్టేడియంలో తమ శిక్షణా సెషన్‌లను ప్రారంభించింది. బుమ్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శిక్షణా సెషన్ నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved