MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Ind Vs Pak: అలా చేస్తే ఇక నుంచి ప్రతి ఏడాది ఇండియా-పాక్ సిరీస్.. ఐసీసీ ముందు రమీజ్ రాజా కొత్త ప్రతిపాదన..

Ind Vs Pak: అలా చేస్తే ఇక నుంచి ప్రతి ఏడాది ఇండియా-పాక్ సిరీస్.. ఐసీసీ ముందు రమీజ్ రాజా కొత్త ప్రతిపాదన..

Ramiz Raja New Proposal: దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక  సిరీస్ ల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజా  సరికొత్త ప్రతిపాదనతో ఐసీసీ ముందుకొచ్చాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Jan 13 2022, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ప్రపంచ క్రికెట్ లో ఇతర జట్లకు లేని క్రేజ్ భారత్-పాకిస్థాన్ మ్యాచులకు ఉంది. యాషెస్ తో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ వైరం కొనసాగుతున్నా.. ఇండియా-పాకిస్థాన్ లతో పోల్చితే అది కూడా తక్కువే అనిపించక మానదు. 
 

210

అయితే గత కొన్నాళ్లుగా ఈ దాయాది దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. సరిహద్దుల్లో మన  సైనికుల మీద  పాక్ దాడులు,  బోర్డర్ లో అక్రమ చొరబాట్లతో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగడం లేదు.

310

ఎప్పుడో ఐసీసీ టోర్నీలలో తప్ప భారత్-పాకిస్థాన్ మ్యాచులు చూడాలనుకునే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. గతేడాది అక్టోబర్ లో ముగిసిన  ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు టీవీలలో  వ్యూయర్షిప్ లు కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. 
 

410

ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఏడాదికోసారి టీ20 సిరీస్ నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా సరికొత్త ప్రతిపాదనతో ఐసీసీ ముందుకొచ్చాడు. 

510

ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక  సిరీస్ లు జరగాలని మేం కోరుకుంటున్నాం. ఒకసారి  మీరు గత మ్యాచుల వ్యూయర్షిప్ ల రికార్డులు చూడండి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం మనల్నే చూస్తున్నది. 

610

అభిమానులకు ఏం కావాలో గమనించండి. దానికి అనుగుణంగా మనం చేద్దాం. భారత్-పాకిస్థాన్ సిరీస్ ల మాదిరిగానే యాషెస్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచులకు కూడా మంచి వ్యూయర్షిప్ దక్కుతున్నది..’ అని పేర్కొన్నాడు. 

710

అంతేగాక.. ‘భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లతో నాలుగుదేశాల మధ్య  ప్రతి సంవత్సరం ఒక టీ20 నిర్వహించాలని మేం పరిశీలిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే తయారుచేశాం. దానిని ఐసీసీ ముందు ఉంచుతాం. ఈ టోర్నీ నాలుగు దేశాల్లో జరిగే విధంగా ప్లాన్ చేశాం..’ అని ట్వీటాడు. 
 

810

ఈ సిరీస్ ను రొటేషన్ పద్దతిలో  ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో నిర్వహించే విధంగా పీసీబీ రూపొందించినట్టు రమీజ్ రాజా  తన ప్రతిపాదనలలో పేర్కొన్నాడు. తద్వారా ఆదాయాన్ని  సమంగా పంచుకునేందుకు వీలుంటుందని తెలిపాడు.
 

910

అయితే రమీజ్ రాజా ప్రతిపాదనపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.  ఈ ప్రపోజల్ పై ఇటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గానీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గానీ ఇప్పటివరకూ  స్పందించలేదు.  
 

1010

కాగా గ‌తేడాది టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. త‌ద్వారా ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ల‌లో భార‌త్‌పై ఆ జ‌ట్టు తొలి సారి విజ‌యం న‌మోదు చేసింది. ఈ మ్యాచును ఏకంగా 15.9  బిలియన్ల (సుమారు 150 కోట్లు) మంది వీక్షించినట్టు (టీవీ, సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లన్నింటిలో కలిపి) గణాంకాలు చెబుతున్నాయి. 

About the Author

SM
Srinivas M
భారత దేశం
పాకిస్తాన్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
MI : రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్? ఐపీఎల్ 2026 తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై?
Recommended image3
CSK : ధోనీ ఇక నంబర్ 7 కాదు? ఐపీఎల్ 2026 కోసం సరికొత్త ప్లాన్.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved