MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఈ ముగ్గురు భారత ప్లేయ‌ర్లు టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు ఆడ‌టం క‌ష్ట‌మే..

ఈ ముగ్గురు భారత ప్లేయ‌ర్లు టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు ఆడ‌టం క‌ష్ట‌మే..

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్-8 మ్యాచ్‌లు జూన్ 19 నుండి ప్రారంభం కానున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భార‌త జ‌ట్టు సూపర్-8 రౌండ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో త‌న తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్లేయింగ్ 11 లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. 
 

Mahesh Rajamoni | Published : Jun 16 2024, 09:38 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో లీగ్ ద‌శ మ్యాచ్ లు దాదాపు ముగియ‌డానికి వచ్చాయి. ఈ క్ర‌మంలోనే సూప‌ర్-8 కోసం ఐసీసీ షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్-8 రౌండ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 20న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు సూపర్-8 రౌండ్‌లో ముగ్గురు ప్లేయ‌ర్లు బెంచ్ కే ప‌రిమితం కానున్నార‌ని స‌మాచారం. వారిలో..

25
Yuzvendra Chahal

Yuzvendra Chahal

యుజ్వేంద్ర చాహల్

టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రౌండ్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే భార‌త తుది జ‌ట్టులో  రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల స్థానం ఖరారైంది. ఇలాంటి పరిస్థితుల్లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉండదు. అంతర్జాతీయ టీ20ల్లో 96 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఘ‌న‌త సాధించాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల కారణంగా టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 రౌండ్‌లో యుజ్వేంద్ర చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడడం కష్టంగానే క‌నిపిస్తోంది.

35
Axar Patel

Axar Patel

అక్షర్ పటేల్       

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ మ్యాచ్‌లలో ఐర్లాండ్, పాకిస్థాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)తో ఆడాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్-8 రౌండ్‌లో అక్షర్ పటేల్ కంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో రవీంద్ర జడేజా రూపంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్ రౌండర్‌ను ఆడేందుకు అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, బౌలింగ్ అటాక్‌లో వైవిధ్యం తీసుకురావడానికి జట్టు మేనేజ్‌మెంట్ కుల్దీప్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఎందుకంటే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకే విధంగా బౌలింగ్ చేస్తారు. అయితే, అక్షర్ పటేల్ ఆడకపోవడంతో, ఒక బ్యాట్స్‌మన్ ఎంపిక కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ కాదు. అటువంటి పరిస్థితిలో, అక్షర్ పటేల్ బెంచ్ కే ప‌రిమితం కావ‌చ్చు. 

45
Rohit Sharma-Sanju Samson

Rohit Sharma-Sanju Samson

సంజు శాంసన్ 

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, అయితే అతను టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 రౌండ్‌లో ఆడే అవకాశం క‌నిపించ‌డం లేదు. సంజూ శాంసన్ కంటే మెరుగైన క్రికెటర్లు టీమిండియాలో చాలా మంది ఉన్నారు. ఇది కాకుండా వికెట్ కీపర్‌గా జట్టు మేనేజ్‌మెంట్‌లో రిషబ్ పంత్ మొదటి ఎంపిక. అటువంటి పరిస్థితిలో టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 దశలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడటం కష్టమే. ఎందుకంటే భార‌త జ‌ట్టులో ఇప్పటికే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వంటి బ్యాట‌ర్లు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం త‌క్కువే. 

55
Asianet Image

టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 
Recommended Stories
Top Stories