- Home
- Sports
- Cricket
- India vs Ireland: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఫిక్స్.. టీమ్ లో ప్లేస్ కోసం ముగ్గురు స్టార్ల మధ్య ఫైట్
India vs Ireland: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఫిక్స్.. టీమ్ లో ప్లేస్ కోసం ముగ్గురు స్టార్ల మధ్య ఫైట్
India vs Ireland: ఐర్లాండ్తో జరిగే తొలి టీ20లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ యంగ్ స్టార్ ఎంట్రీతో భారత జట్టులో మార్పులు జరగబోతున్నాయి. మరి ప్లేయింగ్ 11లో ఎవరికి షాక్ తగలనుంది?

అభిషేక్, సంజూలకు షాక్? వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టీమిండియా ప్లేయింగ్ 11 మారబోతుందా?
భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ శుక్రవారం నుంచి బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో షురూ కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు అందరి ఫోకస్ 15 ఏళ్ల యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ మ్యాచ్తో అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఒక కొత్త టీ20 జర్నీని స్టార్ట్ చేయబోతోంది. టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత టీమ్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ 2026లో తన అదిరిపోయే పర్ఫార్మెన్స్తో క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి.
వైభవ్ను ఆడించడం ఈజీ కాదు.. శాంసన్-అభిషేక్లకు టెన్షన్
టీమ్ మేనేజ్మెంట్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే.. వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్లో ఎక్కడ సెట్ చేయాలి? ఒకవేళ అతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న ఓపెనింగ్ కాంబినేషన్ను మార్చాల్సి ఉంటుంది.
గడిచిన కొన్ని నెలలుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇండియా కోసం అద్భుతంగా రాణించారు. టీ20 వరల్డ్ కప్ స్టార్టింగ్లో బెంచ్కే పరిమితమైన సంజూ.. ఆ తర్వాత మూడు మెమరబుల్ ఇన్నింగ్స్లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
ఇక అభిషేక్ శర్మ టోర్నమెంట్ మొదట్లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయినా, ఆ తర్వాత కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. 2024లో డెబ్యూ చేసినప్పటి నుంచి ఫుల్ మెంబర్ దేశాల ఆటగాళ్లలో టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా అభిషేక్ ఉన్నాడు.
మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది?
టీమ్లో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు, అలాగే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ఆడడం కన్ఫర్మ్. ఇలాంటి టైమ్లో వైభవ్కు ఓపెనర్గా ఛాన్స్ ఇస్తే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లలో ఎవరో ఒకరు బెంచ్కు పరిమితం కాక తప్పదు.
అయితే మరో ఛాన్స్ కూడా ఉంది.. వైభవ్ డెబ్యూ చేస్తూ అభిషేక్తో కలిసి ఓపెనింగ్ చేయవచ్చు. అప్పుడు సంజూ శాంసన్ నంబర్ 3లో, ఇషాన్ కిషన్ నంబర్ 4లో ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ శివం దూబేకు ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇస్తే మాత్రం అతను తన కోటా ఓవర్లను కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
బ్యాట్తో అన్ని ప్రశ్నలకూ ఆన్సర్ ఇచ్చిన వైభవ్
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసి తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన ఇండియా ఏ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లోనే అతను లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు.
అందుకే ఇప్పుడు అతనికి టీమ్లో ఛాన్స్ వస్తుందా లేదా అనేది పాయింట్ కాదు.. ఆ డెబ్యూ క్యాప్ ఎప్పుడు అందుకుంటాడు అనేదే ఇక్కడ క్వశ్చన్. వైభవ్ వయసు ఇప్పుడు కేవలం 15 ఏళ్లే కావడంతో.. టీమ్ మేనేజ్మెంట్ అతని కోసం సపరేట్ ఛేంజింగ్ రూమ్ వంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందు పెద్ద టాస్క్
చాలా కాలం తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీ20 టీమ్లోకి రీఎంట్రీ ఇస్తూ కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు. ఐపీఎల్లో అతని కెప్టెన్సీ రికార్డు సూపర్బ్ గా ఉంది. గత మూడు సీజన్లలో అయ్యర్ 57 మ్యాచ్ల్లో 41 విజయాలు అందుకున్నాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ను ఛాంపియన్గా నిలపగా, 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు.
అయితే, డిసెంబర్ 2023 తర్వాత అతను మళ్లీ టీ20 సెటప్లోకి రావడం ఇక్కడ గమనించాలి. అందుకే కొత్త టీమ్, యంగ్ ప్లేయర్లతో సింక్ అవ్వడం అతనికి చాలా ఇంపార్టెంట్. అయ్యర్ ఫామ్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2025లో 175.07 స్ట్రైక్ రేట్తో 604 రన్స్ చేయగా, 2026 సీజన్లో 168.81 స్ట్రైక్ రేట్తో 498 పరుగులు చేశాడు.
బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ పోటీ
బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా సెలెక్షన్ అంత ఈజీగా లేదు. హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకుని టీమ్లోకి వచ్చినా, అతని ప్లేస్ మునుపటిలా సేఫ్గా లేదు. ప్రిన్స్ యాదవ్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి 14 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీని గోల్డెన్ డక్గా అవుట్ చేసిన అతని బాల్ టోర్నమెంట్లోనే బెస్ట్ డెలివరీగా నిలిచింది.
మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్గా వన్డే క్రికెట్లో తన ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలలో మేనేజ్మెంట్ ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందో చూడాలి.
తొలి టీ20 కోసం టీమ్ ఇండియా అంచనా ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్.
ఐర్లాండ్ స్క్వాడ్: లోర్కన్ టక్కర్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్, గారెత్ డెలానీ, జార్జ్ డోక్రెల్, స్టీఫెన్ డోహెని, మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్, మాథ్యూ ఫోర్డ్, లియామ్ మెకార్తీ, జై మూంద్రా, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, రూబెన్ విల్సన్.
• మొదటి టీ20: జూన్ 26, బెల్ఫాస్ట్
• రెండో టీ20: జూన్ 28, బెల్ఫాస్ట్

