Rishabh Pant: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రిషబ్ పంత్ కు తీవ్ర గాయం
Rishabh Pant: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ గాయపడ్డారు.అతనుగ్రౌండ్ వీడటంతో ధ్రువ్ జురేల్ కీపింగ్ చేస్తున్నారు.

రిషబ్ పంత్ వేళ్లకు గాయం
లండన్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడవ టెస్టులో భారత వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడ్డారు. గాయం తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ ను వీడాడు.
మ్యాచ్ తొలి రోజు రెండవ సెషన్లో 34వ ఓవర్లో పంత్ కు గాయం అయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన లెగ్సైడ్ బంతిని అడ్డుకోవడానికి పంత్ డైవ్ చేశాడు. బౌండరీ రాకుండా అడ్డుకున్నాడు కానీ, బంతి నేరుగా పంత్ వేళ్లకు తగిలింది.
నొప్పి తీవ్రంగా ఉండటంతో వెంటనే భారత ఫిజియో కంఠేష్ జైన్ మైదానంలోకి వచ్చారు. మైదానంలోనే పంత్కు ఐస్తో చికిత్స అందించారు. కానీ పంత్ గాయం తీవ్రంగా ఉండటంతో గ్రౌండ్ ను వీడారు.
పంత్ స్థానంలో తాత్కాలిక కీపర్గా ధ్రువ్ జురేల్
బుమ్రా ఓవర్ ముగిసిన వెంటనే పంత్ మైదానాన్ని వీడి డ్రెస్రూమ్కి వెళ్లిపోయారు. భారత జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ ఉన్నారు.
ఈ టెస్ట్కు ప్లేయింగ్ 11 లో లేకపోయినా, నియమాల ప్రకారం తాత్కాలికంగా పంత్ స్థానంలో కీపింగ్ చేయడానికి ధ్రువ్ జురేల్ అనుమతి ఉంది.
జురేల్ ఇప్పటికే ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన హోం సిరీస్లో మూడు టెస్టుల్లో భారత్ తరఫున కీపింగ్ చేశాడు. అలాగే ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన ‘ఇండియా ఏ’ మ్యాచ్ల్లో కూడా జట్టు తరఫున కీపింగ్ చేశాడు.
పంత్ గాయంపై బీసీసీఐ ఏం చెప్పింది?
బీసీసీఐ ఒక అధికారిక ప్రకటనలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. ప్రస్తుతానికి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు అని తెలిపింది.
బ్రాడ్కాస్ట్ దృశ్యాల్లో పంత్ టేప్తో వేళ్లను ముడిపెట్టుకుని ఐస్ ప్యాక్తో చికిత్స పొందుతూ కనిపించారు. స్కై స్పోర్ట్స్ క్రికెట్ తెలిపిన ప్రకారం, పంత్ వేళ్ల గాయం చాలా తీవ్రమైనది కాదు. చూపుడు వేలికి గాయం అయింది కానీ, ఎముకలకు డ్యామేజ్ కాలేదు అని పేర్కొంది.
పంత్ బరిలోకి దిగుతాడా? లేదా?
పంత్ గాయం భారత జట్టులో ఆందోళన పెంచుతోంది. మంచి ఫామ్ లో ఉన్న పంత్ బ్యాటింగ్ కు దిగకపోతే భారత్ పెద్ద నష్టం జరగవచ్చు.
అయితే, పంత్ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు సిద్ధంగా ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ అధికారిక వైద్య పరీక్షలు తర్వాత మాత్రమే నిర్ణయం వెలువడనుంది.
అతను ఇప్పటివరకు ఈ సిరీస్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు.
పంత్ బ్యాటింగ్ మాత్రమే కాదు, వికెట్ వెనుకవుంటూ అతని ఎనర్జీ, స్ట్రాటజిక్ సూచనలు బౌలర్లకు మద్దతు ఇస్తున్నాయి. అతని లేకపోవడం భారత జట్టుకు మూడవ టెస్ట్ మిగిలిన రోజులపై ప్రభావం చూపించవచ్చు.
ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ చేస్తాడా?
అత్యవసర ఆటగాడిగా ధ్రువ్ జురేల్ కీపింగ్ చేయవచ్చు. కానీ క్రికెట్ నిబంధనల ప్రకారం, కీపర్గా మారిన ప్లేయర్ బ్యాటింగ్ చేయడానికి అర్హత ఉండదు. 2017లో MCC నిబంధనల్లో చేసిన మార్పుల ప్రకారం, మెడికల్ కారణాల వల్ల మాత్రమే వికెట్ కీపింగ్కు రీప్లేస్మెంట్ ఇవ్వవచ్చు. కానీ వారు బ్యాటింగ్ చేయలేరు.