- Home
- Sports
- Cricket
- IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Rishabh Pant Drone Crash Viral Video: భారత్, ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ కొట్టిన షాట్కు డ్రోన్ కూలిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే పంత్ దెబ్బకు డ్రోన్ కూలిందా? అసలు ఏం జరిగింది?

పంత్ భయ్యా కొట్టుడు.. డ్రోన్ కూలుడు.. నిజమేనా?
ముల్లాన్పూర్ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే అది మ్యాచ్ స్కోర్ వల్ల కాదు.. ఒక విచిత్రమైన వీడియో వల్ల.. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక భారీ షాట్ కొట్టాడని, ఆ బంతి వెళ్లి గాల్లో ఎగురుతున్న డ్రోన్ కెమెరాను బలంగా తాకడంతో అది కాస్తా గ్రౌండ్లో కూలిపోయిందనేది ఆ వీడియో సారాంశం.
ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో ఈ క్లిప్ చూసిన నెటిజన్లు "పంత్ పవర్కు డ్రోన్ కూడా షేక్ అయిపోయింది" అంటూ ఒక రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ వీడియోలో కనిపించేదంతా నిజం కాదు.
పంత్ వైరల్ డ్రోన్ వీడియో ఏఐ మాయాజాలం
వైరల్ అవుతున్న ఈ వీడియోను కొంచెం నిశితంగా, లాజికల్గా గమనిస్తే ఇది ముమ్మాటికీ నకిలీ వీడియో అని ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఉన్న అతిపెద్ద బ్లండర్ ఏంటంటే.. ప్రస్తుతం జరుగుతున్నది టెస్ట్ మ్యాచ్ కాబట్టి రూల్స్ ప్రకారం రెడ్ బాల్ వాడాలి. కానీ, ఈ వైరల్ క్లిప్లో బౌలర్ వేసేది, పంత్ కొట్టేది మాత్రం వైట్ బాల్. వన్డేలు, టీ20ల్లో మాత్రమే వైట్ బాల్ వాడతారనే చిన్న లాజిక్ ఇక్కడ ఫేక్ వీడియో మేకర్స్ మిస్ అయ్యారు. అంతేకాదు, ఆ వీడియోలో బంతి తగిలి డ్రోన్ కింద పడిన తర్వాత అక్కడ ఒక బంతి పక్కకు వెళ్లగా, అదే టైమ్లో డ్రోన్ లోపలి నుండి మరో బంతి అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. ఇలా ఒకే చోట రెండు బంతులు ప్రత్యక్షం కావడంతో ఇది పక్కా ఏఐతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో అని తేలిపోయింది.
Helicopter shot❌
Drone shot 💥😂
PANTastic💥#INDvsAFGpic.twitter.com/cfXZJqhdlm— Wanderer (@vkyash18oz) June 7, 2026
సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దాటడం అంత ఈజీ కాదు
సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్లలో స్టేడియంపై ఎగిరే స్పైడర్ క్యామ్లు లేదా డ్రోన్ కెమెరాలను క్రికెట్ బాల్ వెళ్లే గరిష్ఠ ఎత్తు కంటే చాలా పైనే ఉండేలా బీసీసీఐ మేనేజ్ చేస్తుంది. పంత్ తన మార్క్ అగ్రెసివ్ షాట్లు ఆడిన మాట వాస్తవమే కానీ, అవేవీ డ్రోన్ను తాకలేదు. నిజానికి ఈ మ్యాచ్లో పంత్ 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన చేరి సరికొత్త రికార్డులను సృష్టించాడు.
అప్రమత్తంగా ఉండాల్సిందే..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కత్తిమీద సాములా మారింది. కొంతమంది కావాలనే వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి వదులుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండుసార్లు నిజానిజాలు సరిచూసుకోవాలని క్రికెట్ లవర్స్ ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు.

