MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ‘వాళ్లంతా టీ20 స్పెషలిస్టులే.. తొలి టీ20లో వాళ్లను ఓడించడం టీమిండియాకు కష్టమే..’

‘వాళ్లంతా టీ20 స్పెషలిస్టులే.. తొలి టీ20లో వాళ్లను ఓడించడం టీమిండియాకు కష్టమే..’

ENG vs IND T20I: ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడిన టీమిండియాకు  గురువారం జరుగబోయే తొలి టీ20లో ఓటమి తప్పదని  భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

2 Min read
Srinivas M
Published : Jul 07 2022, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇంగ్లాండ్ తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పదని  అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. భారత జట్టుతో పోల్చితే ఇంగ్లాండ్ అన్ని రంగాల్లో బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. 

28
Image credit: PTI

Image credit: PTI

తొలి టీ20కి ముందు అతడు  తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పూర్తిస్థాయి టీ20 స్పెషలిస్టులతో బరిలోకి దిగుతున్నది.  జోస్ బట్లర్, డేవిడ్ మలన్, లివింగ్ స్టన్ వంటి ఆటగాళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగలరు. 

38

ఈ మ్యాచ్ లో బట్లర్-మలన్ లు 75 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేసే అవకాశముంది. బట్లర్ ను  అడ్డుకోవడం చాలా కష్టం. ఇంగ్లాండ్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. అయితే ఈ మ్యాచులలో  బట్లర్‌ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. డేవిడ్ మలన్ కూడా  దాటిగా ఆడగలడు. 

48

ఇక భారత్ విషయానికొస్తే రోహిత్ శర్మ ఓపెనర్ గా ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లు 70 ప్లస్ స్కోరు చేసే అవకాశముంది. మూడో స్థానంలో   సంజూ శాంసన్, దీపక్ హుడాలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి..’ అని చోప్రా అన్నాడు. 
 

58

రెండు జట్ల బలాబలాలను పోల్చితే తొలి టీ20లో ఇండియాపై గెలిచే అవకాశాలు ఇంగ్లాండ్ కే మెండుగా ఉన్నాయని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ పరంగా భారత్ పటిష్టంగానే కనిపిస్తున్నా బ్యాటింగ్ లో చూసుకుంటే ఇంగ్లాండ్  బలంగా ఉందని  అన్నాడు. 
 

68

అంతేగాక ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 15 సిక్సర్లు నమోదు చేస్తాయని చోప్రా జోస్యం చెప్పాడు. పరుగుల వరద ఖాయమని.. విజయం మాత్రం ఇంగ్లాండ్ దే అని చోప్రా అభిప్రాయపడ్డాడు. 

78

ఈ మ్యాచ్ కు అతడు భారత్ తరఫున ఆడబోయే ప్లేయింగ్ ఎలవెన్ ను కూడా అంచనావేశాడు. ఈ మ్యాచ్ లో అతడు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తో పాటు అర్షదీప్ సింగ్ లకు చోటు కల్పించలేదు.  చోప్రా జట్టు ఇలా ఉంది. 
 

88

రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్
 

About the Author

SM
Srinivas M
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved