MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • india : 92 ఏళ్ల క్రికెట్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైమ్ - చ‌రిత్ర సృష్టించిన భార‌త్

india : 92 ఏళ్ల క్రికెట్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైమ్ - చ‌రిత్ర సృష్టించిన భార‌త్

IND vs BAN: చెన్నైలో బంగ్లాదేశ్‌ను ఓడించడంతో భారత క్రికెట్ జట్టు అంత‌ర్జాతీయ టెస్టు ఫార్మాట్ లో 179వ విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ సూప‌ర్ షో తో భార‌త్ కు విజ‌యాన్ని అందించారు.  

3 Min read
Mahesh Rajamoni
Published : Sep 22 2024, 07:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IND vs BAN: చెన్నైలో అద్భుతమైన ఆటతో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌ను 280 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ క్ర‌మంలోనే టెస్టు క్రికెట్ లో స‌రికొత్త మైలురాయిని అందుకుంది. 92 ఏళ్ల టెస్టు చ‌రిత్ర‌లో మ‌రో ఘ‌న‌త సాధించింది. ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచి భార‌త్ త‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో పైచేయి సాధించి బంగ్లాదేశ్ టీమ్ ను చిత్తుగా ఓడించింది.

25

ఈ విజయంతో భారత్ ఓటముల కంటే ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన సుదీర్ఘ ఫార్మాట్‌లో 92 ఏళ్ల నిరీక్షణను ముగించింది. 92 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి సారి భార‌త్ తాను ఆడిన మ్యాచ్ ల‌లో ఓట‌ముల కంటే విజ‌యాలు ఎక్కువ సాధించిన జ‌ట్ల స‌ర‌స‌న చేరింది. 580 మ్యాచ్‌లు ఆడిన భారత్‌కి ఇది 179వ టెస్టు విజయం. ఈ సంవత్సరాల్లో భారత్ వరుసగా 178 టెస్టు మ్యాచ్‌లు ఓడిపోయి 222 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

178 ఓటములతో పోలిస్తే 179 విజయాల రికార్డుతో 92 ఏళ్ల టెస్టు చరిత్రలో భారత్ ఓటముల కంటే ఎక్కువ విజయాలు సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనత భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలైట్ టీమ్‌ల జాబితాలో చేర్చింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, కేవలం ఏడు జట్లు మాత్రమే ఏదో ఒక సమయంలో త‌మ ఓటముల కంటే ఎక్కువ విజయాలను నమోదు చేశాయి. అయితే, ప్ర‌స్తుతం కేవ‌లం ఐదు జ‌ట్లు మాత్రమే ఈ రికార్డును కొనసాగిస్తున్నాయి.

35
Indian Win vs Bangladesh

Indian Win vs Bangladesh

ఓటముల కంటే ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన జట్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు 580 మ్యాచ్ ల‌ను ఆడింది. ఇందులో విజయాలు 179 కాగా, 178 ఓట‌ములు ఉన్నాయి. మిగిలిన 222 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఒక మ్యాచ్ టై అయింది. భారత్‌తో పాటు, ఓటముల కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఇతర జట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు ఉన్నాయి. 

ఆస్ట్రేలియా 414 విజయాలు, 232 ఓటములతో టాప్ లో ఉంది. ఇంగ్లాండ్ జ‌ట్టు 325 ఓటములు, 397 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 179 విజయాలు, 161 ఓటములతో ఉంది. ఆ త‌ర్వాత స్థానంలో ఉన్న పాకిస్థాన్ 144 ఓటములు, 148 విజయాలు సాధించింది. భారతదేశం ఈ ప్రత్యేకమైన రికార్డును చేరుకోవడానికి అత్యధిక సమయం తీసుకుంది. 580 మ్యాచ్‌లు ఆడి-కనీసం ఒక్కసారైనా ఈ రికార్డును అందుకున్న  ఏడు జట్లలో అత్యంత నెమ్మది జ‌ట్టుగా నిలిచింది. 

45

అయితే, ఆస్ట్రేలియా ఈ మైలురాయిని చాలా వేగంగా అందుకుంది. 1877లో ఇంగ్లండ్‌తో జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత దానిని సాధించింది. అలాగే, రెండు జట్లు-ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ లు కూడా ఓట‌ముల కంటే ఎక్కువ విజ‌యాలు అందుకున్న జ‌ట్లలో ఉన్నాయి. కానీ, ఆ ఘ‌న‌త‌ను నిల‌బెట్టుకోవ‌డంలో స‌క్సెస్ కాలేదు. టెస్టులు ఆడే మ‌రో దేశాలు ఇప్పటికీ ఈ విజయవంతమైన రికార్డును సాధించాలని చూస్తున్నాయి.. వాటిలో న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్ లు ఉన్నాయి. 

కాగా, ఆదివారం జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో భారత్ విజ‌యం సాధించ‌డంలో భార‌త స్టార్ ప్లేయ‌ర్ రవిచంద్రన్ అశ్విన్ హీరోగా నిలిచాడు. బ్యాట్ తో పాటు బాల్ తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి టీమిండియాకు సూప‌ర్ విక్టరీ అందించాడు. 

 

55

అశ్విన్ తొలి  ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌లో చారిత్రాత్మక విజయం తర్వాత మ‌స్తు జోష్ లో టెస్టు సిరీస్ ఆడ‌టానికి వ‌చ్చిన బంగ్లాదేశ్ కు భార‌త్ ఈ విజ‌యంతో దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింద‌ని చెప్పాలి. అశ్విన్ తో పాటు ఘోర కారు ప్ర‌మాదం త‌ర్వాత తొలి టెస్టు ఆడుతున్న రిష‌బ్ పంత్ సైతం సెంచ‌రీతో మెరిశాడు. గిల్ కూడా మ‌రోసారి త‌న బ్యాట్ ప‌వర్ చూపిస్తూ సెంచ‌రీతో నాటౌట్ గా నిలిచాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రిషబ్ పంత్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved