MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్ ట్రంప్ కార్డు అతనే - రిషబ్ పంత్‌కు గంగూలీ మద్దతు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్ ట్రంప్ కార్డు అతనే - రిషబ్ పంత్‌కు గంగూలీ మద్దతు

Sourav Ganguly backs Rishabh Pant: ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషిస్తాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పంత్ రాబోయే సిరీస్ లలో భారత ట్రంప్ కార్డు అవుతాడని పేర్కొన్నాడు.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 11 2024, 11:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Sourav Ganguly backs Rishabh Pant: భారత మాజీ స్టార్ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి కూడా గంగూలీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతు ఇచ్చాడు. బంగ్లాదేశ్‌పై అద్భుతమైన సిరీస్ విజయం తర్వాత ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా టాప్ లో ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బంగ్లాదేశ్‌పై అద్భుతమైన సిరీస్ విజయం తర్వాత భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. భారతదేశం ఈ నెల 16 నుంచి మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీని తర్వాత 2025లో ఇంగ్లండ్‌తో స్వదేశీ సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్నాయి. ఇవి చాలా కష్టతరమైనదని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

న్యూజిలాండ్‌తో తమకు మూడు హోమ్ టెస్టులు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా పర్యటన భారత్‌కు అతిపెద్ద పరీక్ష అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.టీమ్ ఇండియాకు రాబోయే సవాళ్లను గంగూలీ హైలైట్  చేస్తూ కామెంట్స్ చేశారు. మీడియాతో గంగూలీ మాట్లాడుతూ..  రాబోయే సిరీస్‌లు ఎంత క్లిష్టంగా ఉంటాయనే విషయాలను నొక్కి చెప్పారు. 

35

"రాబోయే టెస్టు సీజన్ అతిపెద్ద సవాలు. భారత్‌కు ఇది అత్యంత కఠినమైన సవాలు. ఆస్ట్రేలియాలో ఐదు టెస్టులు, ఆపై ఇంగ్లండ్ సిరీస్‌లో 5 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. నిజంగానే ఇది భారీ సవాలు" అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లు గ్లోబల్ వేదికపై టీమ్ ఇండియా ప్రతిభకు, నైపుణ్యానికి నిజమైన పరీక్ష అని సౌరవ్ గంగూలీ అన్నారు.

ఘోర కారు ప్రమాదం తర్వాత దాదాపు సంవత్సరం పైగా క్రికెట్ కు దూరంగా రిషబ్ పంత్ మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చిన తీరు ఎంతో మందికి స్పూర్తినిచ్చే విషయం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పంత్ టెస్ట్ క్రికెట్ పునరాగమనాన్ని గంగూలీ ప్రశంసించారు. దాదాపు 21 నెలల విరామం తర్వాత టెస్టు క్రికెట్‌కు తిరిగి వచ్చినందుకు గంగూలీ పంత్‌ పై ప్రశంసలు కురిపించారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో పంత్ సెంచరీ చేసి 161 పరుగులు చేశాడు.

45

"రిషబ్ పంత్ టెస్ట్‌లలో అత్యుత్తమ ఆటగాడు. అతను రాబోయే  సిరీస్ లలో భారత్ కు ట్రంప్ కార్డ్ అవుతాడు" అని గంగూలీ చెప్పాడు. ఆస్ట్రేలియాతో రాబోయే సిరీస్‌ను తన దైన బ్యాటింగ్ తో భారత్ వైపు తిప్పగల పంత్ సామర్థ్యంపై తన విశ్వాసాన్ని నొక్కి చెప్పారు. 

రాబోయే టెస్టులో న్యూజిలాండ్ ముప్పును గురించి కూడా గంగూలీ ప్రస్తావించారు. స్వదేశంలో న్యూజిలాండ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతున్న తరుణంలో ఆ టీమ్ నుంచి పెద్దగా ప్రమదం పొంచేవుండే అవకాశం లేదని అభిప్రాయపడ్దారు. తొలి టెస్టులో తమ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ లేకుండానే వారు బరిలోకి దిగే అవకాశం ఉంది.

55
Rishabh Pant, India

Rishabh Pant, India

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో ఆల్-టైమ్ గ్రేట్‌గా అవతరిస్తున్నాడనీ, అయితే అదే సమయంలో సౌత్‌పావ్ తన ఆటను పొట్టి ఫార్మాట్‌లలో పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 2022లో ఘోర కారు ప్రమాదం తర్వాత ఆదివారం పంత్ మొదటిసారిగా టెస్ట్ జట్టుకు తిరిగి వచ్చాడు.

చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన 2024 టెస్ట్ సిరీస్‌కు రిషబ్ పంత్ విజయవంతమైన పునరాగమనం గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే గాయాల నుంచి కోలుకోవడం నుండి పునరుజ్జీవనం వరకు అతని అద్భుతమైన ప్రయాణం అభిమానులు-నిపుణులు కొనియాడారు. 

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 128 బంతుల్లో 13 బౌండరీలు, నాలుగు  సిక్సర్లతో 109 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. గిల్‌తో కలిసి పంత్ నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్‌ను 67/3 దారుణ పరిస్థితిలో ఉన్న సమయంలో 287/4తో ఆకట్టుకోవడంలో వారి భాగస్వామ్యం కీలకమైంది. 

అతని పునరాగమన ఈ ఇన్నింగ్స్ రిషబ్ పంత్ సహనాన్ని - నిర్భయ విధానాన్ని ప్రదర్శించింది. డైనమిక్ - ప్రతిభావంతులైన క్రికెటర్‌గా అతని స్థితిని పునరుద్ఘాటించింది. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో అక్టోబర్ 16న ప్రారంభం కానున్న హోమ్ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రిషబ్ పంత్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved