MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బెంగళూరు: ఆర్సీబీ హోం గ్రౌండ్ లో ఇక క్రికెట్ మ్యాచ్ లు లేనట్టేనా?

బెంగళూరు: ఆర్సీబీ హోం గ్రౌండ్ లో ఇక క్రికెట్ మ్యాచ్ లు లేనట్టేనా?

Bengaluru: ఐపీఎల్ 2025 టైటిల్ గెలుపు తర్వాత.. ఆర్సీబీ విజయోత్సవం క్రమంలో జూన్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా బెంగళూరులో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌లు రద్దు చేశారు. ఇక్కడి మ్యాచ్ లను నవీ ముంబై వేదికకు మార్చారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 22 2025, 11:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెంగళూరుకు షాక్.. చిన్నస్వామి స్టేడియం నుంచి మ్యాచ్ లు తరలింపు
Image Credit : Getty

బెంగళూరుకు షాక్.. చిన్నస్వామి స్టేడియం నుంచి మ్యాచ్ లు తరలింపు

బెంగళూరులోని  ఏం. చిన్నస్వామి స్టేడియం ఇకపై మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 వేదిక కాదు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవం క్రమంలో జూన్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ స్టేడియం పెద్ద ఈవెంట్లకు పనికిరాదని విచారణల్లో తేలింది. 

దీంతో, ఐసీసీ మ్యాచ్‌లను నవి ముంబై, కొలంబో వేదికలకు మార్చింది. ఒకప్పుడు క్రికెట్ పట్ల బెంగళూరువారి మక్కువకు ప్రతీకగా నిలిచిన ఈ స్టేడియం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవమానానికి గురైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

DID YOU
KNOW
?
బెంగళూరు క్రికెట్ స్టేడియం
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు హోం గ్రౌండ్ గా ఉంది. జూన్ లో ఇక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు.
26
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట
Image Credit : Getty

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

జూన్‌లో ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన సందర్భంగా బెంగళూరు వీధులు అభిమానులతో నిండిపోయాయి. వేలాదిగా వచ్చిన అభిమానులు స్టేడియం బయట సంబరాలు జరుపుకున్నారు. కానీ, ఆ ఆనందం విషాదంగా మారింది. పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

Related Articles

Related image1
TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. 5 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ యాక్సెస్‌
Related image2
ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో ఆడటానికి భారత్ ఎన్ని సార్లు నో చెప్పింది?
36
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఘటనపై దర్యాప్తు
Image Credit : Asianet News

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఘటనపై దర్యాప్తు

ఈ సంఘటన అనంతరం దర్యాప్తులు జరిగాయి. విచారణ కమిటీ చిన్నస్వామి స్టేడియం పెద్దసంఖ్యలో జనం వచ్చే ఈవెంట్లకు సురక్షితంగా ఆతిథ్యం ఇచ్చే పరిస్థితిలో లేదని తేల్చింది. పోలీసులు కూడా ఇక్కడ ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. వేదిక మార్పు గురించి ఐసీసీ అధికారికంగా అనుకోని పరిస్థితులు అంటూ పేర్కొంది. కానీ, విచారణ కమిటీ రిపోర్టుతో వేదికను మార్చింది.

46
బెంగళూరుకు బదులుగా నవి ముంబైలో మ్యాచ్ లు
Image Credit : Getty

బెంగళూరుకు బదులుగా నవి ముంబైలో మ్యాచ్ లు

బెంగళూరు బదులుగా, నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా మారింది. ఇది మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక సెమీ ఫైనల్, అవసరమైతే ఫైనల్‌ను కూడా ఆతిథ్యం ఇస్తుంది. దీంతో పాటు గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో లు కూడా వేదికలుగా నిర్ణయించారు. మొదట బెంగళూరులో జరగాల్సిన భారత్-శ్రీలంక తొలి మ్యాచ్ ఇప్పుడు అస్సాంలో జరగనుంది. భారత్ లోని నాలుగు వేదికలు, శ్రీలంకలో ఒక వేదికను ఈ టోర్నీ కోసం ఫిక్స్ చేశారు.

56
వేదిక మార్పుపై జైషా ఏమన్నారంటే?
Image Credit : X/BCCIWomen

వేదిక మార్పుపై జైషా ఏమన్నారంటే?

ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ.. "నవి ముంబై మహిళల క్రికెట్‌కు నిజమైన హోమ్‌గా అవతరించింది. ఇక్కడి అభిమానుల మద్దతు అంతర్జాతీయ మ్యాచ్‌లు, వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సమయంలో అద్భుతంగా కనిపించింది. ఈ ఉత్సాహం వరల్డ్ కప్‌లో కూడా కొనసాగుతుందని నమ్ముతున్నాను" అని అన్నారు. 

అలాగే, ఈ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమైన మలుపుగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు.

66
మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్
Image Credit : X/BCCIWomen

మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్

  • మొదటి సెమీ ఫైనల్: అక్టోబర్ 29 – గౌహతి లేదా కొలంబో
  • రెండో సెమీ ఫైనల్: అక్టోబర్ 30 – నవి ముంబై
  • ఫైనల్: నవంబర్ 2 – కొలంబో లేదా నవి ముంబై

2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటాయి. 2013 తర్వాత భారత్‌లో జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ ఇదే. బెంగళూరుకు ఇది చేదు అనుభవంగా మిగిలిపోగా, నవి ముంబై క్రికెట్ లో మరో చరిత్రను రాయడానికి సిద్ధమవుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
బెంగళూరు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved