Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2026: ఈ ఏడుగురు భారత జట్టులో ఉండాల్సిందే !

T20 World Cup 2026: ఈ ఏడుగురు భారత జట్టులో ఉండాల్సిందే !

T20 World Cup 2026: ఐపీఎల్ 2025 పలువురు యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత జట్టులో చేరడానికి బలమైన పోటీని ఇస్తున్నారు. తాము జట్టులో ఉండటానికి అర్హులమని నిరూపించారు.

Mahesh Rajamoni | Published : May 22 2025, 10:53 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
భారత జట్టులో ఉండాల్సిన ప్లేయర్లు
Image Credit : Getty

భారత జట్టులో ఉండాల్సిన ప్లేయర్లు

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో అనేక మంది  యంగ్, ప్రతిభావంతులైన ఆటగాళ్ళు బ్యాట్, బాల్‌తో తమ ప్రతిభను చూపిస్తున్నారు. ఆటగాళ్ళు లీగ్‌లో తమ కోసం ఒక బలమైన స్థానాన్ని ఉంచుకోవడంతో పాటు వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టులో చోటు కోసం పోటీదారులుగా మారారు. అలాంటి ఏడుగురు ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

28
1. సాయి సుదర్శన్
Image Credit : Getty

1. సాయి సుదర్శన్

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుధర్శన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 56.09 సగటుతో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో 617 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వరుసగా మూడో సీజన్‌లో సాయి సుదర్శన్ 350+ పరుగులు సాధించాడు. గత సీజన్‌లో అతను గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్. 

22 ఏళ్ల  సాయి సుదర్శన్ దూకుడుగా ఆడే టాప్ ఆర్డర్ బ్యాటర్. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. 2024లో జింబాబ్వేతో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో భారత్ తరపున ఆడాడు, కానీ అతని ఫామ్, స్థిరత్వాన్ని బట్టి ఈ ఫార్మాట్‌లో ఇప్పుడు సుదీర్ఘంగా ఆడే సమయం ఆసన్నమైంది. అతన్ని ఫ్యూచర్ లో భారత జట్టుకు టాప్ ఆర్డర్ ఆప్షన్‌గా తీర్చిదిద్దవచ్చు.

Related Articles

IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
Mitchell Marsh: ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్
Mitchell Marsh: ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్
38
2. ప్రభు సిమ్రాన్ సింగ్
Image Credit : Getty

2. ప్రభు సిమ్రాన్ సింగ్

భారత జట్టులో చోటు దక్కించుకోవాల్సిన మరో ఆటగాడు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్. 28 ఏళ్ల ఈ ఆటగాడు PBKS తరపున స్థిరంగా రాణిస్తున్నాడు, వరుసగా మూడు సీజన్లలో 300 పరుగులు సాధించాడు. ప్రస్తుతం అతను పంజాబ్ కింగ్స్ తరపున రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు, 12 మ్యాచ్‌లలో 38.16 సగటుతో నాలుగు అర్ధ సెంచరీలతో 458 పరుగులు సాధించాడు.

అతను దూకుడుగా ఆడే బ్యాటర్, పవర్‌ప్లేలో పేసర్లను ముందుగానే ఎదుర్కొనే సామర్థ్యంతో టాప్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని తీసుకురాగలడు, స్పిన్‌ దంచికొట్టే ప్లేయర్. ఇది అతన్ని టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత టీ20 జట్టుకు విలువైన చేర్పుగా చేస్తుంది. గత ఏడాది సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబరిచాడు, 6 మ్యాచ్‌లలో 34.50 సగటుతో 207 పరుగులు కొట్టాడు.

48
 3. ప్రియాంష్ ఆర్య
Image Credit : Getty

3. ప్రియాంష్ ఆర్య

ఢిల్లీకి చెందిన యంగ్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు, ఢిల్లీ టీ20 లీగ్, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో విజయవంతమైన సీజన్ తర్వాత, ప్రియాంష్ ఆర్య తన జోరు, స్థిరత్వాన్ని IPL 2025లో కొనసాగించాడు.  ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరపున మూడవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు, 12 మ్యాచ్‌లలో 29.67 సగటుతో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 356 పరుగులు సాధించాడు.

ఇది అరంగేట్ర ఐపీఎల్ సీజన్ అయినప్పటికీ భయం లేకుండా అద్భుతమైన స్ట్రోక్‌ప్లే, ఒత్తిడిలో ప్రశాంతత, మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను వేగవంతం చేసే సామర్థ్యంతో జాతీయ ఎంపికకు బలమైన పోటీదారుగా మారాడు.

58
4. ప్రసిద్ధ్ కృష్ణ
Image Credit : Getty

4. ప్రసిద్ధ్ కృష్ణ

ప్రసిద్ధ్ కృష్ణ గాయాల కారణంగా రెండు సీజన్లకు దూరం అయిన తర్వాత ఐపీఎల్‌కు అద్భుతంగా తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందంతో ప్రస్తుతం IPL 2025లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉన్నాడు, 12 మ్యాచ్‌లలో 17.57 సగటుతో, 7.85 ఎకానమీ రేటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 

కర్ణాటక పేసర్ తన వేగాన్ని అందంగా మారుస్తున్నాడు, బ్యాటర్లు బంతిని అంచనా వేయడం కష్టతరం చేస్తూ సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయగలడు. కృష్ణ భారత్ తరపున కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు, అతని చివరి మ్యాచ్ 2023లో జరిగింది. IPL 2025లో అతని ఫామ్, స్థిరత్వాన్ని బట్టి, ప్రసిద్ధ్ కృష్ణ భారత టీ20 జట్టుకు తిరిగి రావడానికి బలమైన పోటీదారుగా మారాడు.

68
5. ఆయూష్ బదోని
Image Credit : Getty

5. ఆయూష్ బదోని

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బ్యాటర్ ఆయుష్ బదోని పేరు ఎక్కువగా వినపడదు కానీ, భారతదేశంలోని ప్రతిభావంతులైన టీ20 ఆటగాళ్లలో ఒకడు. ఢిల్లీ ప్రీమియర్ టీ20 లీగ్ తొలి సీజన్‌లో బదోని 8 మ్యాచ్‌లలో 58.00 సగటుతో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో 522 పరుగులతో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన ఫామ్‌ను కొనసాగించాడు, 12 మ్యాచ్‌లలో 32.90 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో 329 పరుగులు సాధించాడు.

మునుపటి సీజన్‌లో కూడా అతను బాగా రాణించాడు, 14 మ్యాచ్‌లలో 235 పరుగులు చేశాడు. అతను దూకుడుగా ఆడే మిడిల్ ఆర్డర్ బ్యాటర్, కీలక పరిస్థితుల్లో జట్టు కోసం స్థిరమైన ఇన్నింగ్స్ లను ఆడగలడు. ఇది అతన్ని టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత టీ20 జట్టులో మిడిల్ ఆర్డర్ పాత్రకు బలమైన పోటీదారుడిగా చేస్తుంది.

78
6. సాయి కిషోర్
Image Credit : Getty

6. సాయి కిషోర్

టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత టీ20 జట్టులోకి ఎంపిక చేయబడేందుకు పరిగణించబడే మరో ఆటగాడు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్. అతను  జీటీ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో ఒకడు, ప్రస్తుతం IPL 2025లో జట్టు తరపున రెండవ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉన్నాడు,.12 మ్యాచ్‌లలో 19.60 సగటుతో, 8.77 ఎకానమీ రేటుతో 15 వికెట్లు పడగొట్టాడు. కిషోర్ మిడిల్ ఓవర్లలో GTకి నమ్మకమైన బౌలర్‌గా ఉన్నాడు, తన టైట్ లైన్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు.

88
7. యష్ దయాల్
Image Credit : Getty

7. యష్ దయాల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ రెండు IPL సీజన్లలో అత్యంత మెరుగైన బౌలర్లలో ఒకడు. 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతూ రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదిన తర్వాత దయాల్.. అద్భుతమైన రీఎంట్రీతో తిరిగివచ్చాడు. RCB కోసం డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా తనను తాను మార్చుకున్నాడు. 14 మ్యాచ్‌లలో 15 వికెట్లతో IPL 2024లో RCB తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 27 ఏళ్ల ఈ ఆటగాడు జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో ఒకడు. 11 మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 
Recommended Stories
Top Stories