4 4 4 6 6 4.. సూర్య కుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్..
Suryakumar Yadav : భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. శ్రీలంక బౌలింగ్ ను చిత్తు చేస్తూ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Suryakumar Yadav
IND Vs SL, Suryakumar Yadav : పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే సూర్య కుమార్ అర్ధ సెంచరీ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసిన శ్రీలంక బ్యాటర్లు అతన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. సూర్య సూపర్ ఇన్నింగ్స్ దెబ్బతో శ్రీలంక ప్లేయర్లకు చెమటలు పట్టలించాడు.
Team India , cricket
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత క్రీజులోకి వచ్చిన యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. శుభ్మన్ గిల్ 34 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ జైస్వాల్తో కలిసి శ్రీలంక బౌలింగ్ ను ఆటాడుకున్నాడు.
Suryakumar Yadav
ధనాధన్ ఇన్నింగ్స్ తో బౌండరీల వర్షం కురిపించాడు. 58 పరుగుల తన ఇన్నింగ్స్ లో కెప్టెన్ సూర్య కుమార్ 8 ఫోర్లు, 2 అద్భుత సిక్సర్లు బాదాడు. కేవలం 22 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కెప్టెన్ సూర్య కుమార్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఈ మ్యాచ్ సూర్య కుమార్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. సూర్య ఫోర్లు, సిక్సర్లలో శ్రీలంక ఆటగాళ్లు చెమటలు పట్టించాడు. 58 పరుగులతో చెలరేగిన సూర్య కుమార్ చివరకు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడంతో శ్రీలంక బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ సైతం సూపర్ ఇన్నింగ్స్ చెలరేగాడు. జైస్వాల్ 40, గిల్ 34, సూర్య 58, పంత్ 49 పరుగుల ఇన్నింగ్స్ భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 170 పరుగులకు ఆలౌట్ అయింది.