- Home
- Business
- ఏంటీ.. రూ.24.8 లక్షల కోట్ల లావాదేవీలా? అది కూడా ఒక్క నెలలో.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కొత్త రికార్డ్
ఏంటీ.. రూ.24.8 లక్షల కోట్ల లావాదేవీలా? అది కూడా ఒక్క నెలలో.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కొత్త రికార్డ్
UPI Transactions: దేశ వ్యాప్తంగా జరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక్క మార్చి నెలలో రూ.24.8 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయంటే ప్రజలు డిజిటల్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ ని ఎంతలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో డిజిటల్ ఇండియా రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
యూపీఐ ఎప్పుడూ రికార్డులు కొడుతూనే ఉంది. 2025 మార్చి నెలలో రూ.24.8 లక్షల కోట్ల విలువైన డబ్బులు చేతులు మారాయి. అది కూడా 1,830 కోట్ల లావాదేవీలకే ఇన్ని రూ.లక్షల కోట్లు మార్పిడి జరగడం నిజంగా రికార్డే. గత ఏడాది ఇదే టైంలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే ఇది 36% ఎక్కువ. డబ్బు విలువ కూడా 25% పెరిగింది. దీన్ని బట్టి ఇండియా డిజిటల్ లావాదేవీల్లో ఎంత వేగంగా డవలప్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది అంటే 2025 ఫిబ్రవరి నెలలో దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన 1,611 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే పెద్ద రికార్డు అనుకుంటే మార్చి నెలలో మరో రూ.రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరగడం అద్భుతమైన విషయం. ఈ లెక్కన మార్చి నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం ఇప్పుడు రోజుకు సగటున 59 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్న మాట.
అంటే ప్రతి సెకనుకు 6,800 లావాదేవీలను యూపీఐ హ్యాండిల్ చేస్తోంది. ఈ లెక్కన రోజువారీ లావాదేవీల విలువ రూ.79,910 కోట్లు.
గతంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగిన నెలలను గమనిస్తే అక్టోబర్ 2024లో ఒక నెలలోనే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. అప్పుడు రూ.23.5 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. పండుగల సీజన్ కావడంతో ఆన్లైన్ అమ్మకాలు బాగా జరగడం వల్ల ఇంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది
లావాదేవీల సంఖ్య పరంగా జనవరి 2025లో 1,700 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొత్తానికి యూపీఐ లావాదేవీలు మొత్తం 18,586 కోట్లు కాగా, దీని విలువ రూ.260.5 లక్షల కోట్లుగా లెక్క తేలింది.
ఇది కూడా చదవండి అంతరిక్షంలో పుట్టగొడుగులు పెంచితే ఎలా ఉంటుంది? ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం
యూపీఐ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే షాక్ అవుతారు
2024 ఆర్థిక సంవత్సరంలో 13,113 కోట్ల లావాదేవీలలో రూ.200 లక్షల కోట్ల డబ్బులు చేతులు మారాయి. దీంతో పోలిస్తే 2025లో బాగా పెరిగింది. లావాదేవీల సంఖ్య 41% పెరిగింది. వాటి విలువ 30% పెరిగింది. ఇంత వేగంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ట్యాక్సులు ఎగ్గొట్టకుండా, నిజాయతీగా లావాదేవీలు జరుగుతుండటం వల్ల దేశం కూడా వేగంగా డవలప్ అవుతుందనడంలో సందేహం లేదు.