MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Bank Fraud: ఆ బ్యాంకులో భారీ మోసం, మనీ ట్రాన్సాక్షన్స్ ఆపేయన్న ఆర్బీఐ

Bank Fraud: ఆ బ్యాంకులో భారీ మోసం, మనీ ట్రాన్సాక్షన్స్ ఆపేయన్న ఆర్బీఐ

Bank Fraud: డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులే సేఫ్ అని అనుకుంటాం కదా.. కాని బ్యాంకుల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ బ్యాంకులో మేనేజర్ మరికొందరు కలిసి కస్టమర్ల డబ్బును దోచేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఎంత డబ్బు పోయిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : Feb 16 2025, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బ్యాంకుల పనితీరు ఎలా ఉంటుందంటే.. లోన్స్ ఇచ్చేటప్పుడు వడ్డీ ఎక్కువ వసూలు చేస్తారు. డిపాజిట్ల ద్వారా సేవింగ్స్ చేసుకొనే వారికి మాత్రం తక్కువ వడ్డీ ఇస్తారు. దీనికి కారణం లేకపోలేదు. లోన్ తీసుకున్న వారు ఎగ్గొడితే నష్టాలు భరించాలన్న ముందు జాగ్రత్తగా వడ్డీ రూపంలోనే ఎక్కువ వసూలు చేసేస్తారు. నిజాయితీగా ఉండే వారు మాత్రం మోసం చేయకూడదన్న ఉద్దేశంతో ఈఎంఐలు సక్రమంగా కట్టేస్తారు. 

24

కాని బ్యాంకుల్లో పనిచేసే వారే కస్టమర్ల కష్టార్జితాన్ని దోచేస్తే ఇక ఎవరిని నమ్మాలి. సరిగ్గా ఇదే సంఘటన మహరాష్ట్రలోని ముంబైలో ఇటీవల చోటుచేసుకుంది. గత ఫిబ్రవరి 13న ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ బ్యాంకులో ఎవరూ ఎలాంటి లావాదేవీలు చేయవద్దని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు, మోసగాళ్లతో జాగ్రత్త: RBI హెచ్చరిక

34

ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ భారీ మొత్తాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతనితో పాటు మరొకరు ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 316(5), 61(2) కింద కేసు నమోదు చేశారు. ఈ బ్యాంకులో ఈ భారీ కుంభకోణం 2020 నుంచి 2025 వరకు జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ భారీ కుంభకోణం ఎలా జరిగింది? ఈ ఘటనలో ఎవరెవరున్నారు అనేది తెలుసుకునేందుకు ‘ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్’కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

44

ఆర్బీఐ దర్యాప్తు

బ్యాంకు భద్రతా విధానాలు ఉల్లంఘించారన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్యాంకు గత రెండేళ్ల ఆర్థిక నివేదిక కూడా వెలుగులోకి వచ్చింది. గత 2023లో రూ.31 కోట్ల నష్టం వచ్చినట్లు అందులో ఉంది. అంతేకాదు 2024 మార్చి నాటికి రూ.23 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిసింది. ఈ భారీ మోసాన్ని గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకులో ఎవరూ డబ్బులు డిపాజిట్ చేయవద్దని, దర్యాప్తు తేలేదాకా డ్రా చేయవద్దని సూచించింది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image2
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Recommended image3
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved