Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Viral: చనిపోయిన భర్త కంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కువా.? ఆ ప్రకటనపై మండిపడుతోన్న నెటిజన్లు

Viral: చనిపోయిన భర్త కంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కువా.? ఆ ప్రకటనపై మండిపడుతోన్న నెటిజన్లు

ప్రతీ రోజూ మనం ఎన్నో ప్రకటనలు చూస్తుంటాం. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ప్రకటన సంస్థలు రకరకాల యాడ్స్‌ను రూపొందిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యాడ్స్‌ విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా ఓ ప్రకటన ఇలాగే విమర్శలను ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏంటా యాడ్‌ అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..   

Narender Vaitla | Updated : Feb 27 2025, 05:27 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
12
Viral News

Viral News

జీవిత భీమా.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తదనంతరం మన కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇలాంటి పాలసీలకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. కాగా జీవిత బీమాకు సంబంధించి ప్లాన్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాడ్‌ కంపెనీలు రకరకాల వీడియోలను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పాలసీ బజార్‌ సంస్థ రూపొందించిన ఓ యాడ్‌పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 

22
Viral video

Viral video

ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందంటే.. 

పాలసీ బజార్‌ అనేది ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థ. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న సంస్థగా ఈ కంపెనీకి పేరు ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతోన్న ఛాంపియర్న్‌ ట్రోఫీ సందర్భంగా ఈ సంస్థ ఒక కొత్త ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భర్తను కోల్పోయిన భార్య.. తన భర్త టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయడంలో విఫలమయ్యాడని నిరాశను వ్యక్తం చేస్తుంది. 

దండ వేసున్న ఫొటో ముందు కూర్చొని నువ్వు టర్మ్‌ పాలసీ తీసుకుంటే ఉంటే మా జీవితాలు ఇలా ఉండేవా కావు కదా.? అన్న అర్థం వచ్చేలా ఆమె మాటలు ఉంటాయి. 'ఇప్పుడు నేను పిల్లల స్కూల్‌ ఫీజులు ఎలా కట్టాలి.? ఇంటి ఖర్చులు కూడా ఉన్నాయి.? అంటూ ఆ మహిళ ప్రకటనలో చెబుతుంది. ఇదిగో ఈ మాటలే ఇప్పుడు చర్చకు దారి తీశాయి. 

సోషల్‌ మీడియా వేదికగా ఈ యాడ్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రకటనలు అనేవి క్రియేటివిటీ ఉండాలి, అంత వరకు బాగానే ఉంది కానీ మరీ ఇలా భయ పెట్టేవిగా ఉండడం సరైంది కాదని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఈ యాడ్‌ మరీ భయపెట్టేలా ఉందంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం సరైందే కానీ.. మరీ ఇంత దారుణంగా భయపెట్టేలా ఉండడం ఏమాత్రం మంచిది కాదంటూ స్పందిస్తున్నారు వెంటనే ఈ ప్రకటనను ఆపేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై పాలసీ బజార్‌ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

వివాదానికి కారణమైన యాడ్‌ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి. 
 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories