ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు..
Indian Railways: ఐఆర్సీటీసీ 25 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో లేదా తర్వాత ఆన్లైన్లో ఆహారం, వాటర్ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై రైళ్లలో మీరు ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. రైల్వే నిర్ణయించిన మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు రైలు ఎక్కే ముందు తమ భోజనాన్ని బుక్ చేసుకోగలరు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తన కొత్త ఈ-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం, ఇది దేశవ్యాప్తంగా 25 రైళ్లలో అందుబాటులో ఉంది. సుదూర ప్రయాణికులకు భోజన ఏర్పాట్లను సులభతరం చేసే లక్ష్యంతో ప్రారంభించారు.
ఈ-ప్యాంట్రీ సేవలు..
ఈ సేవలను మొదట వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తర్వాత ఇతర రైళ్లకు కూడా విస్తరించారు. IRCTC ప్రకారం, ఈ సౌకర్యం టికెట్ ధరలో భోజనం చేర్చని రైళ్లకు మాత్రమే. ఇది ప్రయాణికులను ప్యాంట్రీ సిబ్బందిపై ఆధారపడకుండా ముందుగానే భోజనం బుక్ చేసుకోవడంలో సహాయపడుతుందని చెప్పింది. ఈ సేవలు IRCTC ప్రస్తుత టికెట్ బుకింగ్ సిస్టమ్తో అనుసంధానించిన డిజిటల్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఎలా?
టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన, RAC ఉన్న ప్రయాణికులు కూడా ముందుగానే ఆహారం, ప్యాకేజ్డ్ తాగునీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలో ప్యాంట్రీ కార్ సిబ్బంది వారి సీట్లకు ఆహారాన్ని డెలివరీ చేస్తారు. ముఖ్యంగా ప్యాంట్రీ కార్ సౌకర్యాలు మాత్రమే ఉన్న రైళ్లలో, సుదూర ప్రయాణాల సమయంలో ఆహార సేవలను మరింత పారదర్శకంగా ఈ వ్యవస్థను రూపొందించామని IRCTC తెలిపింది. టికెట్ బుకింగ్ సమయంలో లేదా తరువాత “టికెట్ బుకింగ్ హిస్టరీ” నుండి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ద్వారా నగదు రహిత చెల్లింపు డెలివరీని నిర్ధారించడానికి SMS లేదా ఈమెయిల్ ద్వారా మీల్ వెరిఫికేషన్ కోడ్(MVC) ఆర్డర్ డిజిటల్ ట్రాకింగ్ ఫీచర్.. ఆహారం అందుబాటులో లేనట్లయితే వాపసు వస్తుంది
ప్రయాణ ఆహారాన్ని ఎలా బుక్ చేసుకోవాలి?
IRCTC వెబ్సైట్ లేదా యాప్లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ-ప్యాంట్రీ ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు ఆర్డర్ చేయకపోతే, వారు "బుక్డ్ టికెట్ హిస్టరీ" విభాగానికి వెళ్లి తర్వాత భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు. భోజనం బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణికులకు కన్ఫర్మేషన్ మెసేజ్, MVC కోడ్ వస్తాయి. డెలివరీ సమయంలో ఈ కోడ్ను భోజనం తీసుకొచ్చే అతడికి చూపించాలి. ప్రయాణ రోజున, ప్యాంట్రీ సిబ్బంది సీట్ల దగ్గరకు ఆహారాన్ని డెలివరీ చేస్తారు.
ఈ సౌకర్యం ఏ రైలులో అందుబాటులో ఉంది?
ప్రస్తుతం, 25 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివేక్ ఎక్స్ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్, పశ్చిమ్ ఎక్స్ప్రెస్ వంటి సుదూర, అధిక డిమాండ్ ఉన్న రైళ్లలో ఉన్నాయి. IRCTC ప్రకారం, ప్రయాణికుల రెస్పాన్స్ బట్టి భవిష్యత్తులో మరిన్ని రైళ్లలో ఈ సేవలను ప్రవేశపెట్టనున్నారు.

