Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?
Gold Prices: బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు భారీ షాక్ లో ఉన్నారు. నిన్న, ఇవాళ పుత్తడి ధరలు జోరందుకున్నాయి. ఇవాళ హైదరాబాద్ గ్రాము బంగారం ఎంతో తెలుసా?..

సామాన్యులపై భారం
ఇవాళ మార్కెట్లు ప్రారంభంకాగానే పసిడి ధరలు రాకెట్ లా దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకునేవారికి ఇది అదనపు భారంగా మారబోతోంది. వెండి కూడా ఇదే బాటలో నడుస్తోంది.
రూ.1,49,080కు దూసుకెళ్లిన బంగారం
హైదారాబాద్ లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరిగి రూ.1,49,080కు చేరుకుంది. ఆభరణాల గోల్డ్ పై రూ.450 ఎగబాకి...రూ.1,36,650వద్ద నమోదైంది. వెండి కూడా భారీగా రూ.5వేలు దూసుకెళ్లి...రూ.2,70,000కు చేరుకుంది.
సందేహంలో కొనుగోలుదారులు
రెండ్రోజులుగా పసిడి, సిల్వర్ రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. మూడ్రోజుల క్రితం భారీగా తగ్గి...ఇప్పుడు మళ్లీ భయపెడుతున్నాయి. అందుకే ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అని పసిడి ప్రియులు, కొనుగోలుదారులు సందేహంలో ఉన్నారు. భారతదేశంలో బంగారం ధరల్ని ప్రభావితం చేయడానికి ప్రధాన కారణం...అమెరికా వడ్డీ రేట్లు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గి...తగ్గినప్పుడు పసిడి రేట్లు పెరుగుతాయి.
నిపుణుల సలహా ఉత్తమం
డాలర్ మార్పులు, పశ్చిమాసియాలో ముదురుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెట్లు అన్నీ కలిసి బంగారం మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. బంగారం కొనాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

