Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్
Today Gold Price: అక్షయ తృతీయ ముగిసిన వెంటనే బంగారం మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పండగ రోజున పెరిగిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. తులం బంగారం ధర రూ.2200 పైగా కుప్పకూలిపోయింది. వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి.

అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు పతనం
అక్షయ తృతీయ సమయంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. అయితే పండగ ముగిసిన వెంటనే మార్కెట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల్లోనే తులం బంగారం ధర రూ.2200 పైగా తగ్గిపోయింది.
తులంపై రూ.1200 తగ్గిన పసిడి
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,200 తగ్గి రూ.1,53,550కి చేరింది. అదే సమయంలో 22 క్యారట్ బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,40,750గా నమోదైంది. ఇక 18 క్యారట్ బంగారం కూడా రూ.900 తగ్గి రూ.1,15,160కు చేరింది.
తగ్గుతున్న వెండి ధరలు
బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.5,000 వరకు పడిపోయి ప్రస్తుతం రూ.2,70,000గా ఉంది.
గత ధరలతో పోలిస్తే జనవరి 29న 24 క్యారట్ బంగారం ధర రూ.1,78,850గా ఉండగా, ప్రస్తుతం అది రూ.1,53,550కి పడిపోయింది. అంటే రూ.25,300 వరకు తగ్గింది. అదే విధంగా 22 క్యారట్ బంగారం ధర అప్పట్లో రూ.1,63,950గా ఉండగా, ఇప్పుడు రూ.1,40,750గా ఉంది. అంటే రూ.23,200 తగ్గింది.
బంగారంపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
బంగారం ధరలు పడిపోవడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం, అక్షయ తృతీయ తర్వాత డిమాండ్ తగ్గడం.
ప్రస్తుతం ధరలు తగ్గడం వల్ల కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం గా భావించవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనాలని భావించే వారికి ఇది అనుకూల సమయం. అయితే మార్కెట్ ఇంకా మార్పులకు లోనయ్యే అవకాశం ఉన్నందున ఒకేసారి కాకుండా దశలవారీగా కొనుగోలు చేయడం ఉత్తమం.

