Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే
Gold Price Hike: ఈరోజు బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మరోసారి దేశీయ బులియన్ మార్కెట్పై ప్రభావం చూపించాయి. అసలేం జరిగిందంటే..

స్వల్పంగా పెరిగిన బంగారం
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, సేఫ్ హెవెన్ పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ధరలు మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఊహించని షాక్ తగిలింది. మరోవైపు వెండి ధరలు మాత్రం మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
రూ.1,43,240కు చేరిన పసిడి
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,240గా నమోదైంది. గత ట్రేడింగ్తో పోలిస్తే రూ.110 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.1,31,300గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దనే కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, ఈరోజు మాత్రం స్థిరత్వం నమోదైంది.
బంగారం ధరల్లో మిశ్రమ ధోరణి
దేశీయంగా బంగారం ధరల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ ఇండెక్స్, ముడి చమురు ధరలు, కేంద్ర బ్యాంకుల విధానాలు రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా ఉండనున్నాయి.

