- Home
- Business
- Gold Price Crash: ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్
Gold Price Crash: ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్
Gold Price Crash: ఇన్నాళ్లూ పరుగులు పెట్టిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మూడు రోజుల వరుస పెరుగుదల తర్వాత పసిడి రేట్లు దిగొచ్చాయి. వెండి కూడా తగ్గింది.

మార్కెట్లు పతనం..భారీగా దిగొచ్చిన పసిడి, సిల్వర్
బంగారం కొనాలనుకునే వారికి ఎట్టకేలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. వరుసగా పెరుగుతూ ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరువైన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కూల్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా పసిడి ధరపై ప్రభావం చూపించాయి.
గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జించారు. అయితే అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో మార్కెట్లో కీలక మార్పులు కనిపించాయి. మరోవైపు డాలర్ విలువ బలపడటంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు బంగారాన్ని విక్రయించారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దిగొచ్చాయి.
ఇదే ప్రభావం దేశీయ మార్కెట్పైనా పడింది.
హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో ఆగస్టు 13 సాయంత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,260 తగ్గి రూ.1,53,600కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.1,150 తగ్గి రూ.1,40,800 వద్దకు వచ్చింది. అయితే తగ్గుదల ఇక్కడితో ఆగలేదు. ఇవాళ ఉదయం మరోసారి పసిడి రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 తగ్గడంతో రూ.1,52,890కి చేరింది. 22 క్యారెట్ల ధర కూడా రూ.650 తగ్గి రూ.1,40,150 వద్ద స్థిరపడింది. వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ప్రస్తుతం రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఎటూ తేలని యుద్ధం
ఇక అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలకు కీలకంగా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితి, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న విభేదాలు, హార్ముజ్ జలసంధిపై నెలకొన్న టెన్షన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు మళ్లీ తీవ్రం కావడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో కూడా కదలికలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. కాల్పుల విరమణపై ప్రకటనలు వచ్చినప్పటికీ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీంతో పశ్చిమాసియా పరిణామాలను ప్రపంచ మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లు కుదేల్
ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్పైనా కనిపిస్తోంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ సుమారు 300 పాయింట్ల వరకు నష్టపోగా, నిఫ్టీ కూడా దాదాపు 100 పాయింట్లు దిగజారింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 87 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా ఒత్తిడిలోనే ఉంది.

