BSNL: రోజుకు 3 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. రూ. 199 మాత్రమే
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో ఎక్కువ డేటాతో కూడిన ప్లాన్స్ను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. యూజర్లను ఆకట్టుకునేందుకు తాజాగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను పరిచయం చేసింది..
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రముఖ ప్రభుత్వ టెలికాలం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4జీ నెట్వర్క్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏకంగా 75,000కిపైగా 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ త్వరలోనే మరో లక్ష టవర్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
దేశంలో ప్రతీ గ్రామంలో 4జీ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. అలాగే యూజర్లను పెంచుకునేందుకు సరికొత్త ప్లాన్స్ను పరిచయం చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 599 ప్లాన్..
ఎక్కువ డేటా కోరుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ యూజర్లు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందొచ్చు. అంటే యూజర్లకు మొత్తం 252 జీబీ డేటా లభిస్తుందన్నమాట. 3 జీబీ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే నెలకు రూ. 199 మాత్రమే అవుతుంది. ఇంత తక్కువ ధరలో రోజుకు 3 జీబీ డేటా లభించడం విశేషం.
ఇక ఇతర బెనిఫిట్స్ విషయానికొస్తే ఈ ప్లాన్తో రీఛార్జ చేసుకుంటే ప్రతీ రోజూ ఉచితంగా 100 ఎస్ఎమ్ఎస్లు పొందొచ్చు. అలాగే ఏ నెట్ వర్క్కి అయినా అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. దీంతో పాటు పలు సబ్స్క్రిప్షన్లను సైతం ఈ ప్లాన్తో ఉచితంగా పొందొచ్చు. బీఐటీవీతో పాటు బీఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేసుకోవచచు. దీనిద్వారా యూజర్లు ఉచితంగా 400 ఛానల్లను వీక్షించవచ్చు. లనెలా రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి, ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్గా చెప్పొచ్చు.