MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఇకపై బేసిక్ శాలరీ రూ. 46 వేలు..

Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఇకపై బేసిక్ శాలరీ రూ. 46 వేలు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన సంఘం అమలుతో భారీ మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది! జీతాలు రూ.18,000 నుంచి రూ.46,260కి పెరగనున్నాయి! ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వేగంగా పెరుగుతున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 07 2025, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వేతన స్కేలు అమలు చేయనున్న నేపథ్యంలో భారీగా జీతాలు పెరగనున్నాయి. దీంతో జీతాలు ఏమేర పెరగనున్నాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

29

జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (JCM) జాతీయ మండలి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై దృష్టి పెడుతున్నారు. 

39

ఉద్యోగుల జీతం పెంపును నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఒక ముఖ్యమైన భాగం. JCM ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57కి పెంచాలని ప్రతిపాదించింది, ఇది 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో పోలిస్తే చాలా ఎక్కువ.

49

ఈ ప్రాతిపాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఫిట్ మెంట్ ప్రతిపాదనను అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

59

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే జీతం ఎంత పెరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు 157% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

69

ఇదిలా ఉంటే ప్రస్తుతం బేసిక్ శాలరీ నెలకు రూ. 18,000గా ఉంది. అయితే  ప్రతిపాదిత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో, ఇది నెలకు రూ. 46,260కి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

79

అదేవిధంగా, కనీస పెన్షన్ నెలకు రూ. 23,130కి పెరిగే అవకాశం ఉంది.అన్ని అనుకున్నట్లు జరిగితే 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 

89

ఇది 7వ వేతన సంఘం కింద 2016లో అమలు చేసిన ప్రస్తుత జీతం విధానానికి ముగింపు పలుకుతుంది. ప్రభుత్వం ఇప్పుడు 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది, దీని ద్వారా కనీస జీతం నెలకు రూ. 34,560 వరకు పెరిగే అవకాశం ఉంది.

99

అయితే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు 157 శాతం పెరుగుతాయి. మరి జీతాలు ఎంత పెరగనున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved