MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్: ఇకపై జెట్ స్పీడ్‌తో 4జీ సేవలు: 93,450 టవర్ల ఏర్పాటు పూర్తి

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్: ఇకపై జెట్ స్పీడ్‌తో 4జీ సేవలు: 93,450 టవర్ల ఏర్పాటు పూర్తి

ఇకపై దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సేవలు జెట్ స్పీడ్ తో అందనున్నాయి. యుద్ధ ప్రాతిపదికన బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 93,450 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. దీంతో స్వదేశీ 4జీ టెక్నాలజీని కలిగి ఉన్న ఐదవ దేశంగా భారతదేశం నిలిచింది. 

1 Min read
Naga Surya Phani Kumar
Published : May 27 2025, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లక్ష 4జీ టవర్ల లక్ష్యం
Image Credit : Indian Tech & Infra

లక్ష 4జీ టవర్ల లక్ష్యం

దేశీయ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరిస్తోంది. లక్ష 4జీ టవర్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు 93,450 టవర్లను ఏర్పాటు చేసిందని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. స్వదేశీ 4జీ టెక్నాలజీతో ఈ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

25
93,450 4జీ టవర్ల ఏర్పాటు
Image Credit : X

93,450 4జీ టవర్ల ఏర్పాటు

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభోత్సవంలో కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 93,450 4జీ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. 

22 నెలల్లో దేశంలోనే తొలి స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. సి-డీఓటీ, బీఎస్ఎన్ఎల్, తేజస్ నెట్‌వర్క్స్, టీసీఎస్ కలిసి బీఎస్ఎన్ఎల్ కోసం ఈ 4జీ టవర్లను ఏర్పాటు చేశాయి. 

Related Articles

Related image1
BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్
Related image2
మీ ఏరియాలో BSNL 4G సిగ్నల్ ఉందా? ఇలా ఈజీగా చెక్ చేయండి
35
4జీ టెక్నాలజీ కలిగిన 5వ దేశం ఇండియా
Image Credit : google

4జీ టెక్నాలజీ కలిగిన 5వ దేశం ఇండియా

స్వదేశీ 4జీ టెక్నాలజీని కలిగి ఉన్న ఐదవ దేశంగా భారతదేశం అవతరించింది. చైనా (హువాయ్), ఫిన్లాండ్ (నోకియా), స్వీడన్ (ఎరిక్సన్), దక్షిణ కొరియా (శామ్‌సంగ్) స్వదేశీ 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన మిగతా నాలుగు దేశాలు. 

45
రూ.2,903 కోట్లు ఇచ్చిన కేంద్రం
Image Credit : Social Media

రూ.2,903 కోట్లు ఇచ్చిన కేంద్రం

18,685 ప్రాంతాల్లో 4G మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.2,903 కోట్ల విలువైన అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ ను బీఎస్ఎన్ఎల్ ఇటీవల టీసీఎస్‌కి ఇచ్చింది. 2023లో టీసీఎస్ దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ విస్తరణ కోసం బీఎస్ఎన్ఎల్ నుండి రూ.15,000 కోట్లకు పైగా విలువైన అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ ను పొందింది. అందులో భాగంగానే  ప్రస్తుతం ఈ ఒప్పందం జరిగింది.

55
లక్ష 4జీ టవర్ల లక్ష్యం
Image Credit : Google

లక్ష 4జీ టవర్ల లక్ష్యం

టీసీఎస్ పర్యవేక్షణలో సీ-డీవోటీ, టీసీఎస్ అనుబంధ సంస్థ తేజస్ నెట్‌వర్క్స్ బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ను విస్తరించాయి. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కోసం లక్ష 4జీ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. మరి కొన్ని నెలల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని బీఎస్ఎన్ఎల్ ధీమా వ్యక్తం చేసింది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved