- Home
- Automobile
- Electric Auto: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 90 కి.మీ వెళ్తుంది.. మిడిల్ క్లాస్ వాళ్లకి బెస్ట్ ఛాయిస్
Electric Auto: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 90 కి.మీ వెళ్తుంది.. మిడిల్ క్లాస్ వాళ్లకి బెస్ట్ ఛాయిస్
Electric Auto: యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు వెళ్తుంది. బడ్జెట్లో దొరికిపోతుంది.

మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటో
యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు వెళ్తుంది. బడ్జెట్లో దొరికిపోతుంది.
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, పియాజియో కంపెనీ 'ఏప్ వేవ్' అనే కొత్త ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది. దీని స్టార్టింగ్ ప్రైస్ రూ. 2.55 లక్షలు (ఎక్స్-ఫ్యాక్టరీ). సిటీలో తిరిగే ఆటోడ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేశారు. ఇందులో 5.4 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి సుమారు 4.5 గంటలు పడుతుంది. ఇది చాలా కాలం మన్నికగా ఉంటుందని, 19 శాతం గ్రేడబిలిటీతో ఎత్తుపల్లాల రోడ్లపై కూడా సులువుగా వెళ్తుందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. రూ.3.9 లక్షలకే మంచి మైలేజ్ ఇచ్చే సూపర్ కారు…మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఛాయిస్.
ఆటో డ్రైవర్లకు బెస్ట్ ఛాయిస్
ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో ప్రత్యేకమైన సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. దీనివల్ల ప్రయాణంలో కుదుపులు, శబ్దం తగ్గుతాయి. 180 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో ఎలాంటి రోడ్లపైనైనా ఇబ్బంది లేకుండా నడపవచ్చు. విశాలమైన క్యాబిన్ రోజువారీ ప్రయాణాలకు మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. పట్టణాల్లో షేర్ ఆటో సర్వీసులకు, ఫిక్స్డ్ రూట్లలో తిప్పడానికి, దగ్గరి ప్రయాణాలకు ఈ వాహనం చాలా అనువుగా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్, తక్కువ నిర్వహణ ఖర్చు వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని కంపెనీ చెబుతోంది. భారత్లో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో సౌకర్యం, భద్రత, నమ్మకాన్ని అందించేలా ఈ కొత్త వాహనాన్ని రూపొందించామని కంపెనీ ఛైర్మన్, ఎండీ డియాగో గ్రాఫీ తెలిపారు. రూ.90వేలకు భారీ డిస్కౌంట్లు, మారుతి సుజుకి మెగా ఆఫర్ల లిస్ట్ ఇదే.

