Shani Dhaiya: ఈ 2 రాశుల వారిపై శని ధైయా ప్రభావం, రెండున్నరేళ్లు కష్టాలు తప్పవు
Shani Dhaiya: 2026లో రెండు రాశుల వారికి శని ధైయా ప్రారంభం కాబోతోంది. ఇది దాదాపు రెండున్నరేళ్ల పాటూ కొనసాగుతుంది. దీని ప్రభావంతో సింహ, ధనుస్సు రాశుల అధికంగా ఉంటుంది. వీరి వృత్తి, కుటుంబ, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చుశ.

శని దైయా అంటే ఏమిటి?
శని దేవుడు ముఖ్యమైన గ్రహం. అతను మనం చేసే పనులకు సరైన కర్మ ఫలితాలను అందిస్తాడు. అందుకే ఆయనను కర్మ దేవుడు అని పిలుచుకుంటారు. శని దేవుడికి కోపం వచ్చిందంటే ఎవరి జీవితమైన నాశనం అయిపోతుంది. ఏ వ్యక్తి అయిన తప్పు చేస్తే అతనికి తగిన శిక్షను వేసేది శనిదేవుడే. కర్మ ఫలితాలకు తగ్గ శిక్షను వేస్తాడు. అందుకే ఎవరైనా సన్మార్గంలోనే ఉండాలి. అప్పుడే ఆయన అనుగ్రహం లభిస్తుంది. న్యాయ మార్గంలో ఉండేవారికి శని దేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు. శని వల్ల కలిగే అశుభ దశలలో ఏలినాటి శని, శని ధైయా ముఖ్యమైనవి.
ఏలినాటి శని ఏడున్నరేళ్లు ఉంటే… శని దైయా రెండున్నరేళ్ల పాటూ ఉంటుంది. జాతకంలో శని నాలుగో లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే శని ధైయా నడుస్తుందని అర్థం. ధైయా మొదలైతే రెండున్నరేళ్ల పాటు దాని ఫలితాలు అనుభవించాల్సిందే. ఏలినాటి శని నడిచే రాశి వారి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కానీ, ధైయా అంత బాధాకరంగా ఉండదు. ధైయా నడిచే రాశి వారి జీవితంలో కూడ కొన్ని సమస్యలు వస్తాయి. అనేక అడ్డంకులు ఎదురవుతాయి.
సింహ రాశి
జ్యోతిష శాస్త్రం ప్రకారం 2026లో రెండు రాశుల వారికి శని ధైయా మొదలవుతుంది. సింహరాశిపై శని దేవుడి ధైయా ప్రభావం ఉంటుంది. అందుకే వీరికి ఆ సమయంలో ఏ పనిలోనైనా బద్ధకం చూపిస్తారు. అయితే వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ఖర్చుల మాత్రం తగ్గవు. పొదుపు చేయలేరు. వచ్చిన డబ్బులు ఖర్చయిపోతాయి. వీరి వైవాహిక జీవితంలో సుఖం ఉంటుంది. కానీ కుటుంబంలో మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు. ఇక ఈ రాశి వారికి పదోన్నతి యోగం ఉంటుంది. అది దక్కే అవకాశం మాత్రం చాలా తక్కువ.
ధనుస్సు రాశి
ఈ ఏడాది ధనుస్సు రాశిపై కూడా ధైయా ప్రభావం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న ధనూ రాశి వారికి కార్యాలయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరికి కష్టాలు వచ్చినా ఎవరూ అండగా నిలిచే అవకాశం లేదు. కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. ఇంట్లో ఉన్న వారితో గొడవలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ప్రేయసితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందుల్లో పడవచ్చు. వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నడుము లేదా కాళ్ల నొప్పుల సమస్య ఉండవచ్చు.
పరిహారాలు చేయండి
శని దైయా సమయంలో వచ్చే సమస్యలను, కష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. సింహ రాశి, ధనుస్సు రాశి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆ సమయంలో వచ్చే కష్టాలు తగ్గే అవకాశం ఉంది. ఈ రాశుల వారు శనివారం శని దేవుడిని పూజించాలి. శని ఆలయానికి వెళ్లి ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనం తరువాత కచ్చితంగా కాళ్లు నీళ్లతో కడుక్కుని నిద్రపోవాలి. ఎవరకైనా ఇనుప వస్తువులను దానం చేస్తే మంచిది. ఇలాంటి పరిహారాల వల్ల శని దైయా ప్రభావం తగ్గే అవకాశం ఉంది.

