మారిన లోకేష్ సీటు: భిమిలీ నుంచి వారిద్దరిలో ఒకరు, గంటా నో
విశాఖపట్నం: భిమిలీ నుంచి లోకసభకు పోటీ చేయాలనే తన ఆలోచనను మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భిమిలీలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
విశాఖపట్నం: భిమిలీ నుంచి లోకసభకు పోటీ చేయాలనే తన ఆలోచనను మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భిమిలీలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నారా లోకేష్ పోటీ చేయనంత మాత్రాన తిరిగి మంత్రి గంటా శ్రీనివాస్ రావు భిమిలీ నుంచి పోటీ చేస్తారని అనుకోవడానికి లేదు. గంటా శ్రీనివాస రావును లోకసభకు పంపించాలని చంద్రబాబు గట్టిగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనను విశాఖ పార్లమెంటు సీటుకు పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది
భిమిలీ సీటు విషయం ఇంకా తేలాల్సి ఉంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కూతురు అదితి భిమిలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చుననే వార్తలు వస్తున్నాయి. ఆమె పేరును చంద్రబాబు సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
భీమిలి నుంచి గతంలో అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు, ఆయన సోదరుడు ఆనందగజపతి రాజు పోటీ చేసి విజయం సాధించారు. భీమిలి ప్రాంతంతో పూసపాటి రాజ కుటుంబానికి సంబంధాలున్నాయి
అయితే భిమిలీ నుంచి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ టీడీపి అభ్యర్థిగా పోటీ చేయవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన టీడీపిలో చేరి, ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఏమైనా, భిమిలీ హాట్ సీట్ గా మారింది