MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2026, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో వానలే వానలు
Image Credit : Getty

ఏపీ, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో వానలే వానలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ మాడ పగలేలా ఎండలతో ఉడికించేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం నల్లబడి మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఒకేసారి తీవ్రమైన ఎండలు, అలాగే పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అకస్మాత్తుగా మారిన సీన్.. అసలు కారణం ఇదే
Image Credit : Getty

అకస్మాత్తుగా మారిన సీన్.. అసలు కారణం ఇదే

వాతావరణంలో ఇంత సడన్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు ఒక భారీ ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ వరకు 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కూడా ఫామ్ అయింది. ఈ డబుల్ ఎఫెక్ట్ వల్లే వాతావరణంలో ఈ అకస్మాత్తు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ద్రోణుల కదలికల వల్ల రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వేగంగా విస్తరించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Related Articles

Related image1
FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Related image2
Visakhapatnam: బాబోయ్.. నడి సముద్రంలో 11 అంతస్తుల మేడ.. 3 రోజులు ఎంజాయ్ చేసే ఛాన్స్.. కార్డేలియా క్రూయిజ్ వచ్చేస్తోంది !
35
వానలు దంచికొట్టే జిల్లాలు ఇవే.. 50 కిమీ వేగంతో గాలులు
Image Credit : Getty

వానలు దంచికొట్టే జిల్లాలు ఇవే.. 50 కిమీ వేగంతో గాలులు

ద్రోణి ఎఫెక్ట్‌తో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.

వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 7 సెం.మీ, గచ్చిబౌలిలో 5 సెం.మీ, గోల్కొండలో 3 సెం.మీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది.

45
అధికారుల హెచ్చరికలు
Image Credit : Getty

అధికారుల హెచ్చరికలు

ఇలాంటి సడన్ రైన్స్ అండ్ ఈదురుగాలుల టైంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద నిలబడకూడదు. పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలి. భారీ గాలుల వల్ల కరెంట్ వైర్లు తెగిపడే ఛాన్స్ ఉంది కాబట్టి, రోడ్లపై వెళ్లేటప్పుడు తెగిన వైర్లు కనిపిస్తే వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

55
పలు ప్రాంతాల్లో మండే ఎండలు
Image Credit : Getty

పలు ప్రాంతాల్లో మండే ఎండలు

వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. జూన్ 11న ఏపీలోని 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 42 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి, గజపతినగరం.. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, పార్వతీపురం.. కాకినాడ అర్బన్, రూరల్.. అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలాల్లో ఎండ దెబ్బ గట్టిగా తగలనుంది. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో టెంపరేచర్స్ 41 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలంగాణ
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..
Recommended image2
Now Playing
AP & TElangana Rain Alert! వాతావరణశాఖా హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు |
Recommended image3
Now Playing
YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
Related Stories
Recommended image1
FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Recommended image2
Visakhapatnam: బాబోయ్.. నడి సముద్రంలో 11 అంతస్తుల మేడ.. 3 రోజులు ఎంజాయ్ చేసే ఛాన్స్.. కార్డేలియా క్రూయిజ్ వచ్చేస్తోంది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved