MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపాను ఎఫెక్ట్ : ఈ ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలు బంద్.. హై అలర్ట్

మొంథా తుపాను ఎఫెక్ట్ : ఈ ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలు బంద్.. హై అలర్ట్

Cyclone Montha : మొంథా తుపాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 28 2025, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొంథా తుపాను: వాహనాల నిలిపివేతకు ఆదేశాలు
Image Credit : PTI

మొంథా తుపాను: వాహనాల నిలిపివేతకు ఆదేశాలు

మొంథా తుపాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసింది. రాష్ట్రంలోని కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (RTGS) తెలిపింది.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు జారీ చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించేవారికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేసింది.

25
మొంథా తుపాను బీభత్సం.. ప్రజలు ఇండ్లలోనే ఉండాలి
Image Credit : stockPhoto

మొంథా తుపాను బీభత్సం.. ప్రజలు ఇండ్లలోనే ఉండాలి

తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఊహిస్తున్న అధికార యంత్రాంగం ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఆప్‌ డేట్లు, అధికారిక హెచ్చరికలు మాత్రమే పాటించాలనే విజ్ఞప్తి చేసింది.

Related Articles

Related image1
దూసుకొస్తున్న మొంథా తుపాను .. వర్ష బీభత్సం.. బయటకు రావొద్దు
Related image2
AI దెబ్బ.. అమెజాన్‌లో 14 వేల ఉద్యోగాలు ఊస్టింగ్‌
35
తూర్పు తీరానికి చేరువలో మొంథా తుపాను
Image Credit : ANI

తూర్పు తీరానికి చేరువలో మొంథా తుపాను

అమరావతి వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం ప్రకారం, కోస్తాంధ్ర తీరం వైపు మొంథా తుపాను వేగంగా దూసుకొస్తోంది. కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికే భూభాగాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

45
తుపాను అలర్ట్: రాష్ట్రవ్యాప్తంగా భారీ సన్నాహాలు
Image Credit : X/AndhraPradeshCM

తుపాను అలర్ట్: రాష్ట్రవ్యాప్తంగా భారీ సన్నాహాలు

తుపాను నిర్వహణ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది..

• రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాల్లో ప్రభావం ఉండే అవకాశం

• 488 కంట్రోల్ రూంలు ఏర్పాటు

• మొత్తం 1,204 పునరావాస కేంద్రాల ఏర్పాటు

• 75,802 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

• 219 మెడికల్ క్యాంపులకు ఏర్పాట్లు

• అత్యవసర సమాచార నిమిత్తం 81 వైర్‌లెస్ టవర్లు సిద్ధం

• భారీ సైజు 21 ఆస్కా ల్యాంపులు సిద్ధంగా ఉంచారు

• 1,447 యంత్రాలు (జేసీబీలు, ప్రోక్లెయినర్లు, క్రేన్లు) సిద్ధం

• చెట్లు తొలగించేందుకు 1,040 రంపాలు సిద్ధం

• 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ

వర్ష ప్రభావంతో 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని నిల్వ ఉంచినట్టు అధికారులు తెలిపారు.

55
భారీ వర్షపాతం నమోదు.. తీవ్రంగా పంట నష్టం
Image Credit : GETTY

భారీ వర్షపాతం నమోదు.. తీవ్రంగా పంట నష్టం

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు గమనిస్తే నెల్లూరు జిల్లా ఉలవపాడు అత్యధికంగా 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

• సింగరాయకొండ: 10.5 సెం.మీ

• కావలి: 12.2 సెం.మీ

• దగదర్తి: 12 సెం.మీ

• బి.కోడూరు: 6 సెం.మీ

• కళింగపట్నం: 7 సెం.మీ

• విశాఖ: 2 సెం.మీ

• తుని: 2 సెం.మీ

ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్ల పంట నష్టం జరిగింది. 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ప్రభావితమయ్యాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
వాతావరణం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved